Home » AP Govt
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిస్థాయిలో ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహాయ, సహాకారాలు అందిస్తామని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో నేడు ఆంధ్రప్రదేశ్ దేశానికే పెట్టుబడుల హాబ్గా నిలుస్తోందని పేర్కొన్నారు.
గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని..
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించలేదు.
ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో ప్రయోజనాలు చూపిస్తున్నామని పేర్కొన్నారు.
పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి, సరఫరాను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు.
పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది.