Home » AP Employees
టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని పేర్కొన్నారు.
ఐఏఎస్ అధికారి అహ్మద్బాబుపై దాఖలైన వ్యాజ్యంలో సోమవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులుకు పదోన్నతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమేశ్ కుమార్ వేసిన పిటిషన్పై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. లోకల్ క్యాడర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ కలెక్టరేట్లో భూసేకరణ విభాగంలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పరిహారం కోసం వచ్చిన ఓ వృద్ధురాలు ఆగ్రహంతో ఉద్యోగులపై కారం చల్లిన సంఘటన చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసును సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.
కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లస్కర్ల వేతనాలను పెంచాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.
ఎస్.కోటకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మీతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారా? అంటూ ఔనైతే ఒకటి, కాదయితే రెండు నొక్కండంటూ చెప్పింది. ఆయన జవాబు ఇవ్వకపోవడంతో మళ్లీ రింగ్యింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రాధాన్య పోస్టుల్లో పనిచేస్తున్న 2018 గ్రూప్ వన్ పరీక్ష నుంచి ఎంపికైన అధికారులను ఫోకల్ పోస్ట్ నుంచి రిలీవ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు