Home » AP Employees
ప్రజల భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
జలధార - జలహారతి ఇక నిరంతర కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలపై నిషేధానికి అమలు తేదీ ఖరారైంది. జులై 13వ తేదీ నుంచి పోస్టుల సృష్టి, అప్గ్రేడేషన్పై ఏపీ ప్రభుత్వం నిషేధం అమలు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులను.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తెనాలిలో మంత్రి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు
కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీలో జనగణన విధుల్లో నిర్లక్ష్యం వహించిన 10 మంది ఆర్పీలపై (రిసోర్స్ పర్సన్స్) జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విధులకు గైర్హాజరైన 10 మంది ఆర్పీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ మోడల్ స్కూల్స్లో కాంట్రాక్ట్ సిబ్బంది సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. 123 మంది ఫిజికల్ డైరెక్టర్లు, 120 మంది కంప్యూటర్ టీచర్ల సేవలను పునరుద్ధరించింది.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్నట్లే... ఇకపై ప్రతి శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా నిర్ణయించామని పేర్కొన్నారు.
ఐ అండ్ పీఆర్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ కేవలం ప్రభుత్వానికి ఓ ఆభరణంలా తయారైందని సీరియస్ అయ్యారు.