Home » AP Employees
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్లను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం.
పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ఇంజనీరింగ్ అధికారులు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
2024 జనవరి 1 నుంచి డీఏను 3.64% పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యోగ సంఘాలతో ఏపీ సచివాలయంలో సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.
పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు మాట్లాడారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు.
సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొదటి విడుత డీఏ బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే మిగిలిన సీపీఎస్ ఉద్యోగులు అందరికీ 90శాతం బకాయిలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారని మంత్రి నారాయణ హెచ్చరించారు.
సాంఘిక సంక్షేమ బీసీ గురుకుల హాస్టళ్లలో వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా స్థాయి అధికారులు హాస్టళ్లను సందర్శించి పరిస్థితులను ఎందుకు చక్కదిద్దడం లేదని ప్రశ్నించింది. అధికారుల ప్రవర్తనపై ఏపీ హై కోర్టు ఆసహనం వ్యక్తం చేసింది.