Home » AP Congress President
గిరిజన బిడ్డల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గిరిజన బిడ్డలు ఏం తింటున్నారో చూసే పర్యవేక్షణ ఈ ప్రభుత్వానికి అసలే లేదని వైఎస్ షర్మిల విమర్శించారు.
రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది తమ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీని విశ్వశిస్తున్నారని.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని షర్మిల సూచించారు.
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి న్యాయ నిపుణుడికి ఇండియా కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయమని షర్మిల వ్యాఖ్యానించారు.
మహానేత YSR పేరు పెట్టినంత మాత్రాన ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా అని షర్మిలా ప్రశ్నించారు. YSR ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడని కీర్తించారు.
జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారని..ఇప్పుడేమో 2.0 అని మొహం చూపిస్తాడట అని షర్మిల ఎద్దేవా చేశారు.
YS Sharmila: మోదీ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నలవర్షం కురిపించారు. బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడుల ఘటనను వాడుకుంటుందని.. ఇది చాలా బాధాకరమని వైఎస్ షర్మిల అన్నారు.
YS Sharmila: హింసకు కారణం అవుతున్న మద్యం, మత్తు పదార్థాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదని మండిపడ్డారు.
YS Sharmila: . ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై క్లారిటీ లేనే లేదని చెప్పారు.
YS Sharmila: మిర్చి, టమాట రైతులను కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ధరలు పడిపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్ షర్మిల చెప్పారు.
YS Sharmila: గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులకు అండగా ఉంటామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు.అభ్యర్థులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని షర్మిల డిమాండ్ చేశారు.