Home » AP Assembly Budget Sessions
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారాయన. తనలాంటి వాళ్లు ఎంతోమంది కనీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. కల్తీ మద్యంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.
ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై నేడు ధన్యవాదాల తీర్మానం, చర్చ నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ చర్చను ప్రారంభించనున్నారు.
హిందూ మతాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు.
ఏపీ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి హాజరైన వైసీపీ సభ్యులు కేవలం 11 నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయారు.