Home » Andhrapradesh
చిత్రావతి నది నుంచి ఇసుకను పెద్దఎత్తున తోడేస్తున్నా.. సంబంధిత అధికారులు సట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇతర వాహనాల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు.
జగన్ రాజకీయ కుట్ర బద్దలైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆయన మాట్లాడుతూ..స్కిల్ డెవల్పమెంట్ వ్యవహారంలో చంద్రబాబునాయుడుపై నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసును కోర్టు కొట్టివేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మార్కెట్లో కోడిమాంసం ధరలు రోజురోజుకూ కొండెక్కొ కూర్చుంటున్నాయి.. అయితే.. రొయ్య మాత్రం తగ్గిపోతోంది. వ్యాధులు, సీడ్, ఫీడ్ నాణ్యత లోపంతో నష్టాలు బారిన పడిన ఆక్వా రంగం విస్తీర్ణంలో దాదాపు 70శాతం తగ్గిపోయింది. వివరాలిలా ఉన్నాయి.
సావరపాలెం గ్రామ పెద్దలు సబ్ జూనియర్స్కు 70 కిలోల బరువు, సీనియర్స్కు 120 కిలోల బరువుతో కూడిన ‘గుండు రాయి’ పోటీలు జరుపుతారు. పోటీలకు నిర్ణీత సమయం ఐదు నిమిషాలు కాగా, ఆ సమయంలో పోటీదారులు గుండు రాయిని పైకి ఎత్తి భుజం పైనుంచి వెనక్కు పడేయాల్సి ఉంటుంది.
భూమాత పరిచిన పచ్చని తివాచీల్లాంటి వరిచేలు... అందమైన కొబ్బరిచెట్ల నడుమ... నేలకు దిగి వచ్చిన ఇంద్రధనస్సులా సాగుతుంది కోనసీమ ‘ప్రభల తీర్థం’. అదొక దృశ్య కావ్యం లాంటిది.
చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో అనంతపురం జిల్లా మడకశిర ఏరియా వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. అలాగే ఎలుగుబంట్లు కూడా సంచరిస్తుండడంతో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
మీకు చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి.. అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులకు ఆయన సవాల్ విసిరారు. అలాగే.. వారు 15 నెలలుగా కనిపించడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన కల్పిస్తోంది. అదానీ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే.. రోళ్ల మండలంలో కూడా చిరుత పులి సంచారం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వతేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.