Home » Andhra Pradesh
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఏపీ పోలీస్ టీ20 క్రికెట్ టోర్నీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. పోలీసులు ఇప్పటికే ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్లో ముందుంటారని చెప్పారు. ఈ టోర్నీతో పోలీసుల ప్రైడ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విడాకులు ఇవ్వలేదని భార్యను హతమార్చాడు భర్త. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో వేంకటేశ్వరుడి ఫొటోలతో నిరసనకు దిగారు. వైసీపీ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గోదావరి పుష్కరాల్లో నది కాలుష్యం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు సభలో తెలియజేశారు.
రోడ్లపై గుంతలకు శాశ్వత పరిష్కారం చూపే యంత్రం నగరానికి వచ్చేసింది.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిమిషాల వ్యవధిలో మరమ్మతులు చేపట్టి రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టనుంది. అదే.. ఇన్ఫ్రారెడ్ రీసైక్లింగ్ పోత్ హోల్ అండ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మెషిన్, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రోడ్ల మరమ్మతుల్లో వేగం, నాణ్యత, ఖర్చు తగ్గింపే లక్ష్యంగా ఈ మెషిన్ కీలక పాత్ర పోషిస్తుంది. నగరాభి వృద్ధి దిశగా ఇదో ముందడుగు.
ప్రస్తుతం పంటకు మార్కెట్లో ధర లేదు. రైతులు కోల్ట్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే వ్యవసాయ ఉత్పత్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపించటంతో కోల్డ్ స్టోరేజీల యజమానులు నిబంధనలను కాలరాస్తున్నారు.
పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జీవవైవిధ్యం అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు గురువారం ముగి సింది. ఈ సదస్సులో కర్ణాటక సైన్స కళాశాల ధార్వాడ్ బోటనీ విభాగం ప్రొఫెసర్ కోట్రేశ మాట్లాడుతూ మానవుడి రకరకాల చర్యల వల్ల భూమి వాతావరణం వేడెక్కుతోందని, ఇది ఇలాగే కొనసాగితే అత్యం త ప్రమాదకరమని అన్నారు.
స్థానిక బుగ్గ రామలింగేశ్వర స్వామి అల యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్సంగా గు రువారం శివపార్వతులకు వ సంతోత్సవం నిర్వహించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని గురువారం ఘనంగా నిర్వ హించారు. ఆరె కటిక కులస్థులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయ న చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.