Home » Andhra Pradesh
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 6200 ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కింద నెలకు రూ.10 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పైనా విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు జగన్ అండ్ కో ఫండింగ్ ఇస్తోందని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందుకు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ఆరా తీశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విశాఖ తీరంలో అల్పపీడన వాతావరణం వల్ల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ అధినేత మావిగన్పై చెప్పే మాటలు నిలకడలేనివని ఎద్దేవా చేశారు.
విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. దేశ సార్వభౌమాధికారానికి, సమాజ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలపై యూట్యూబర్ రావణ్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో తండ్రి గొనుగుంట్ల పోతులూరయ్య, ఆయన కుమార్తె రామాంజమ్మ వారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.