Home » Ananthapuram
పాతాళానికి పడిపోయిన అరటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటా ధర రూ.25 వేలకు చేరడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు.
మండలంలోని చిగతుర్పి గ్రామంలో లింగప్పకు చెందిన రెండు మేకలు చిరుతదాడిలో మృతిచెందాయి. బాధితుడు లింగప్ప ఇంటివద్ద కట్టేసిన మేకలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది.
మండలంలోని పాల్తూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు మిరపకాయల చోరీకి పాల్పడ్డారు. రైతులు తెలిపిన మేరకు గ్రామానికి చెందిన వై. నాగరాజు రెండెకరాలు కౌలుకు తీసుకుని గుంటూరు కారం మిరపకాయలను సాగు చేశాడు.
తాడిపత్రి నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమగా మారుద్దామని మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
వీధి కుక్కల బతుకు నిజంగానే ‘కుక్క బతుకు’ అవుతోంది. కనిపిస్తే చాలు.. వెంటబడి కరిచి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించినందుకు జనంలో సానుభూతిని పోగొట్టుకున్నాయి.
పట్టా ఇచ్చిన భూమిని చూపాలని నాలుగు దశాబ్దాలకు పైబడి కొందరు రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పట్టాలు పొందిన వారు మరణిస్తున్నా వారి వారసులకు కూడా నేటికీ న్యాయం జరగడం లేదు.
జగన్ పాలనలో సీమకు తీరని ద్రోహం జరిగిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మండలంలోని గూటిబైలు గ్రామం వద్ద తిమ్మమ్మ మర్రిమాను ఉంది. చెట్టు వద్దగల తిమ్మమాంబ ఘాట్లో ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.
వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రశ్నించారు.
పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవారు.