Home » Ananthapuram
అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన ఆర్డీటీ సంస్థకు ఎదురైన ఎఫ్సీఆర్ఏ సమస్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు.
నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్క్యాలండర్ విడుదల చేసి మాట నిలుపుకుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
మండలంలోని కక్కలపల్లి మార్కెట్లో టమోటా(Tomato) కిలో గరిష్ఠ ధర రూ.7తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రూప్కుమార్ తెలిపారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై టీడీపీ అర్బన్ నాయకులు మండిపడ్డారు.
పెనుకొండకు మరో పెద్ద పరిశ్రమ రాబోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు జిల్లాలో తగినన్ని అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు.
దైవభక్తి చాటుతూ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 15 వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టాడు. అహ్మద్నగర్కు చెందిన సంజయ్కారత్ దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని 2024 నవంబరు 1న సైకిల్పై బయలుదేరాడు.
యశ్వంతపూర్-కాచిగూడ-యశ్వంతపూర్, కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలను ఈనెల 15వ తేదీ నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
పప్పుశనగ ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెరగకపోవడంతోపాటు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మండలకేంద్రంలో గంజాయి సిగరెట్ రూ.250కి విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. యువతను టార్గెట్గా చేసుకొని గంజా సిగరెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని తాగిన యువకులు మత్తులో తూలుతున్నారు.