Home » Ananthapuram
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో జిల్లా సర్వజనాస్పత్రిలో ఓపీ కష్టాలు పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ‘కిటకిట’ శీర్షికన ఆస్పత్రిలో ఓపీ కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనం అధికారుల్లో చలనం తెచ్చింది. ఆదయాన్నే ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున రెడ్డి ఓపీ కేంద్రాల వద్దకు ...
హిందూ పండుగల్లో మహాశివరాత్రి ముఖ్యమైనది. బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి.
అనంతపురం జిల్లా ఉరవకొండలో బెట్టింగ్ యాప్ల మోసానికి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలయ్యాడు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న అనే రైతు పొలంలోని రెండు ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ఆ అధికారి.. వాటిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఏ భవంతి వద్దకు వెళ్లినా ఆయన ‘ప్రెస్’ను వాడుకుంటున్నారు. ఇంతింత వసూళ్లు ఎందుకు..? అని ఎవరైనా అడిగితే.. ‘ప్రెస్ వాళ్లకు ఇవ్వాలయ్యా..’ అని చెబుతారు. నగరపాలిక టౌన ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఆ ఉన్నతాధికారి వసూళ్ల పర్వానికి హద్దు లేకుండాపోయిందని అంటున్నారు. నగరంలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. టౌనప్లానింగ్ ఉన్నతాధికారిగా వాటిపై ఆయన ...
జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కి చెందిన షేక్ మస్తాన్ వలి రైల్వే గార్డ్గా పనిచేస్తున్నాడు.
అనంతపురం నగరంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో మరణాలు వివాదాస్పదం అవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల సహా పలువురు సరైన వైద్యం అందని కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు నిర్వహిస్తేగానీ ఇలాంటివి బయటకు రావడం లేదు. ఆస్పత్రుల్లో అసౌకర్యాలు, అనుమతి లేని వైద్యం, కన్సల్టెంట్ వైద్యులపై ఆధారపడి ఆస్పత్రుల నిర్వహణ.. ధనదాహం, నిర్లక్ష్యం.. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో ఈ మరణాల వెనుక ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ తరచూ ఆస్పత్రులలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కడా ...
సత్యసాయి తాగునీరు సరఫరా చేసే కార్మికులు సమ్మెలో భాగంగా ఆదివారం నా లుగో రోజు ఆత్మకూరు లోని సత్యసాయి వాటర్ సప్లై పంప్ హైస్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఆర్నెల్లుగా తమకు జీతాలు ఇవ్వకుంటే కుటుంబ పోషణ ఎలా? అని ప్రశ్నించారు.ప్రబుత్వం వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి అటవీ ప్రాంతంలో విద్యార్థిని తలపై బండరాయితో మోది హత్య చేయడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది.