Home » Anagani Satya Prasad
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఆయనకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మంగళవారం అమరావతి వేదికగా మంత్రి అనగాని మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం భూ అక్రమాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు బజార్ రౌడీల స్థాయి కన్నా దిగజారి ప్రవర్తించారని ధ్వజమెత్తారు.
నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ కార్యకర్త జంబులయ్యతో తీయించి.. దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్పీపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్వోసీలను ఎప్పటికప్పుడు అందిస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలకు కష్టకాలంలో అండగా నిలబడుతున్నామని పేర్కొన్నారు.
జగన్ పూర్వీకుల చరిత్ర, ఆయన చరిత్ర ఏంటి అనేది ప్రపంచంలో అందరికీ తెలుసని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్ని దారుణాలు చేశారో, ఎన్ని హత్యలు చేశారో రాయలసీమలో ఏ గడపని అడిగినా చెప్తారని అన్నారు.
ఏపీని గత పాలకులు విధ్వంసం చేసినా.. పునర్నిర్మించుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని.. అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు.
సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం ఆధునిక ప్రజాస్వామ్యంలో అవలంభిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక, పర్యావరణ అనుకూల విధానాలను మంత్రులు అధ్యయనం చేస్తున్నారు.