Home » Anagani Satya Prasad
జాబ్ క్యాలెండర్ విడుదల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తాజా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం.. విద్య, పోలీస్ శాఖలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి అన్నారు.
సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులతో ప్రెస్మీట్లు పెట్టించడం జగన్ దిగజారుడు తనానికి పరాకాష్ఠ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఏడుస్తుంటే ఆమెపైనే నిందలు వేయడం రాజకీయ సంస్కృతా అని జగన్ను నిలదీశారు.
భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖల్లో స్పీడప్ డెలివరీపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
ఏపీ శాసనమండలిలో రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026 , ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు మండలి ఆమోదం తెలిపింది.
అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూములను సౌర విద్యుత్ సంస్థలకు లీజుకు ఇచ్చేలా చట్ట సవరణ చేశామని ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా లోకేశ్ ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రులు ప్రశంసించారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రెవెన్యూ శాఖ శుభవార్త అందించింది. నూతన సంవత్సరం బహుమతిగా భూయజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
రాయచోటి మార్పు వ్యహారంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చాలా బాధపడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మంత్రిమండలి తరవాత కూడా రాంప్రసాద్ రెడ్డిని పిలిచారన్నారు.
తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
పరకామణి చోరీ కేసుపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.