Home » Anagani Satya Prasad
పరకామణి చోరీ కేసుపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు తన విజనరీతో అన్నతాతలకు పంచ సూత్రాలను అందిస్తున్నారని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. పంచ సూత్రాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్తో పోటీ పడతారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రుల బృందం బుధవారం సమావేశమైంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై మంత్రులు చర్చిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలని పునర్విభజించిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లాలు పునర్విభజించిందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
నాలా యాక్ట్ రద్దు బిల్లుపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చించారు. నాలా యాక్ట్ రద్దు అవసరాన్ని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకే నాలా యాక్ట్ రద్దు చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి అనగాని స్పష్టం చేశారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగావకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు ఉంటాయన్నారు.
AP Heavy Rains: వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
గత వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాల విభజన ప్రక్రియను అస్తవ్యస్తం చేసిందని మంత్రి అనగాని ఆరోపించారు. గత ప్రభుత్వం తొందరపాటు తనంలో విభజన చేపట్టిందని విమర్శించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు కాలనీల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు చేపడుతున్నారంటూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు.