Home » Anagani Satya Prasad
ఏపీని గత పాలకులు విధ్వంసం చేసినా.. పునర్నిర్మించుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని.. అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు.
సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం ఆధునిక ప్రజాస్వామ్యంలో అవలంభిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక, పర్యావరణ అనుకూల విధానాలను మంత్రులు అధ్యయనం చేస్తున్నారు.
సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందానికి అక్కడి తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ఈరోజు నుంచి ఏప్రిల్ 27 వరకు సింగపూర్లో మంత్రుల బృందం పర్యటించనుంది.
దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్గా జువ్వలదిన్నె అభివృద్ధి చెందబోతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టులకు పట్టిన గ్రహణం జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో తెలుగువారంతా గర్వించే నగరం అమరావతి అని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా కావాలన్నారని పేర్కొన్నారు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ మూకల దాడులు దారుణమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అబద్దాలు, హత్యలు వైసీపీ నేతల డీఎన్ఏగా మారిందంటూ ఆయన మండిపడ్డారు.
జాబ్ క్యాలెండర్ విడుదల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తాజా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం.. విద్య, పోలీస్ శాఖలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి అన్నారు.
సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులతో ప్రెస్మీట్లు పెట్టించడం జగన్ దిగజారుడు తనానికి పరాకాష్ఠ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఏడుస్తుంటే ఆమెపైనే నిందలు వేయడం రాజకీయ సంస్కృతా అని జగన్ను నిలదీశారు.
భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖల్లో స్పీడప్ డెలివరీపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
ఏపీ శాసనమండలిలో రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026 , ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు మండలి ఆమోదం తెలిపింది.