Home » Amit Shah
భారీ పేలుడు నేపథ్యంలో ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్షా మంగళవారంనాడు తన నివాసంలో రెండోసారి అత్యున్నత భద్రతా స్థాయి సమావేశం నిర్వహించారు.
ఢిల్లీ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్చార్జితో మాట్లాడాననీ, వారిరువురూ ఘటనా స్థలి వద్ద ఉన్నారని అమిత్షా తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. హోం మంత్రి అమిత్షాకు ఫోను చేసి మాట్లాడారు.
తేజస్విని సీఎం చేయాలని లాలూ, రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సోనియాగాంధీ కలలు కంటున్నారని, అయితే వాళ్లు ఆ విషయం మరిచిపోవచ్చని, ఎందుకుంటే ఆ రెండు పోస్టులు ఖాళీగా లేవని అమిత్షా ఛలోక్తి విసిరారు. ఇక్కడ సీఎంగా నితీష్, అక్కడ పీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారిందని అమిత్షా అన్నారు. ఇలా చేసిన ప్రతిసారి బీజేపీకి ప్రజలు ఘనవిజయం కట్టబెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని, కాంగ్రెస్కు భంగపాటు తప్పదని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజస్వి యాదవ్ బిహార్ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు అమిత్షా చెప్పారు. అయితే ఆ రెండు సీట్లూ ఖాళీగా లేవని అన్నారు.
బిహార్ ప్రతిష్టను పెంచేందుకు ప్రధానమంత్రి చేస్తున్న కృషిని అమిత్షా ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ను భారతరత్నతో గౌరవించారని అన్నారు. దేశ ప్రజాస్వామిక, సామాజిక వృద్ధిలో బిహార్ కృషికి ఇది సరైన గుర్తింపని అన్నారు.
ఖగరియాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్షా మాట్లాడుతూ, జేడీయూ నేత నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు మాత్రమే బిహార్ అభివృద్ధిని కాంక్షిస్తుంటారని చెప్పారు. నితీష్ పాలనలో నేరాలు తగ్గాయని, నక్సలిజం నుంచి బిహార్కు విముక్తి కల్పించేందుకు ఎన్డీయే కృషి చేస్తోందని చెప్పారు.
చొరబాటుదారులను సివాన్లో ఉండనీయాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తాను చాలా స్పష్టంగా ఒకమాట చెబుతున్నానని అమిత్ షా అన్నారు. ఎన్డీయేకు ఓటు వేసి గెలిపిస్తే దేశంలోని ప్రతి ఒక్క చొరబాటుదారుని వెనక్కి పంపించి తీరుతామని హామీ ఇచ్చారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఈ నెల 25వ తేదీ కోయంబత్తూరులో పర్యటించనున్నారు. అక్కడి ఈషా యోగా కేంద్రంలో ఈ నెల 26వ తేదీ జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.