Home » America
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచ దేశాలపై తనకు నచ్చినట్టు వాణిజ్య సుంకాలను విధించి ట్రేడ్ వార్లకు తెరతీశారు. అయితే ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో కీలకమైన హోర్ముజ్ జలమార్గం మూసివేయడం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్కు ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది.
పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలంటే తమ షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొజ్తాబాను కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త సుప్రీం లీడర్ అమెరికా అనుమతి తీసుకోవాలని, లేదంటే ఎక్కువ రోజులు ఆ పదవిలో ఉండరని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం.. ఊహించినట్లుగానే భారత్పై పడుతోంది.
గల్ఫ్ ప్రాంతాల్లో భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
ఐటీలో ఉద్యోగం పోయిన ఓ వ్యక్తి టీ అమ్ముతూ జీవనం సాగించడం ఆరంభించాడు. అనతి కాలంలోనే అంతకంతకూ ఎదిగి ఇప్పుడు నెట్టింట ఓ సెన్సేషన్గా మారాడు. సగటున ప్రతి ఐటీ ఉద్యోగిని ఆలోచింపజేసే ఆ టెకీ గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే...
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. భార్యను చంపి పరారీలో ఉన్న వ్యక్తిని పట్టించినా లేదా అతడి ఆచూకీ చెప్పినా 1 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఖమేనీ వారసుడిగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.
అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధి సమీపంలో 16 ఇరానియన్ మైన్లేయర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.