Home » Amaravati
ముచ్చటగా మూడోసారి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందా? అంటే సందేహమేననే ఓ చర్చ అయితే నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. వరుసగా జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో దిగి.. గెలిచారు. కానీ ఈ సారి నియోజకవర్గంలో ఆ పార్టీకి ప్రతికూల ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే... మాట తప్పరు, మడమ తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానని సీఎం జగన్ అన్నారని.. మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించామని.. పెట్టుబడులు వచ్చాయన్నారు.
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో ఇక వాయిదాలు ఉండవని, తడుపరి విచారణ జులై 24న చేపడతామన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వాగతించారు.
అమరావతి: 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతలు ఫోన్లు చేసినా ఎత్తేవారు కాదు. కనీసం కాల్ బ్యాక్ కూడా చేసేవారు కాదు. అలాంటి అధికారులకు ఇప్పుడు తత్వం బోధపడింది. రాష్ట్రంలో అధికారం మారే అవకాశం ఉందని పసిగట్టారు.
విశాఖ: ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ మధురవాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో 300 మంది పసుపు కండువాలు కప్పుకున్నారు.
జగన్పై(YS Jagan) రాయి దాడి విషయంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్రంగా స్పందించారు. సీఎంపై రాయి ఘటనలో అధికార పార్టీ నీచమైన డ్రామాలాడిందని విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఇదే విషయంలో వైసీపీ(YCP) నేతలు చేస్తున్న చిల్లర రాజకీయాలపై ధ్వజమెత్తారు.
అమరావతి: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందంటే ఈసీ చెప్పినట్లు వినాల్సిందే. ఆదేశాలు పాటించాల్సిందే. కేంద్రం సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తీరే వేరు.
అమరావతి: జనసేనకు ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తు కేటాయించింది. అయితే జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించవద్ధని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) హైకోర్టులో పిటిషన్ వేసింది.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ...
అమరావతి: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ, సింగ్నగర్లో జరిగిన రాయి దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రోడ్డు షో సందర్బంగా పలు మార్లు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి.