Home » Amaravati
ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను ఆదేశించారు.
ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలన శాఖకు సీఆర్డీఏ అప్పగించింది.
సింగపూర్ మోడల్తో అమరావతిని నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ పెరగనుందని పేర్కొన్నారు.
ఏపీ రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిలోని S ఆకారపు మలుపుపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది.
రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని.. ఏపీకి ఆర్థిక రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు భావించారని మంత్రి నారాయణ తెలిపారు. తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచే ఎక్కువగా వస్తోందన్నారు.
రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది! అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభిస్తారు.
కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నజేషన్ పెట్టామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆరు నెలలుగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు.