Home » Airport
ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా స్థానికంగా గణనీయమైన పురోభివృద్ధి సాధించవచ్చని జీ.ఎమ్.ఆర్ గ్రూప్ పేర్కొంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో భోగాపురం విమానాశ్రయ గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది.
దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు నేటి అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. గత నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రయాణికులకు నిరంతర సేవలు అందించిన ఈ విమానాశ్రయానికి వీడ్కోలు చెప్పే చారిత్రక ఘట్టం ఆసన్నమైంది.
ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 21 తూటాలు ఉన్న అతని 7.62 ఎంఎం పిస్టల్ను తనిఖీ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి హ్యాండ్బ్యాగ్లో 'కోతి పుర్రె'ను సీఐఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన ఓ విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు గంటల్లో ముగియాల్సిన ప్రయాణం.. తొమ్మిది గంటల సుదీర్ఘ నిరీక్షణగా మారి నరకాన్ని చూపించింది. ఊపిరాడక విమాన క్యాబిన్ 'గ్యాస్ ఛాంబర్'లా మారిందని ప్రయాణికులు వాపోయారు.
మలేషియా నుంచి కొచ్చికి వస్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో కలకలం రేగింది. విమానం ల్యాండ్ అవ్వడానికి కొన్ని నిమిషాల ముందు ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే జగన్కు నచ్చవని విమర్శించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు.
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్ర కలలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెక్కలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. విభజన వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.