Home » Airport
ఢిల్లీలో మరోసారి భారీ బంగారం స్కామ్ బయటపడింది. ఓ వ్యక్తి ప్యాంట్ జేబుల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడున్నర కిలోల పసిడిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శంషాబాద్ విమానాశ్రయంలోని రెండో టెర్మినల్కు సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపుతో భద్రతా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన విమాన ప్రమాదం కలకలం రేపింది. స్విస్ ఎయిర్కు చెందిన విమానం ఇంజిన్లో టేకాఫ్ సమయంలో లోపం తలెత్తి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులను భద్రతాధికారులు ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో వీరివద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన వారిలో ఒకరిని అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్గా గుర్తించారు.
తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ విమానాశ్రయాల పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఎయిర్పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనలలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి, సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది.
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి.
ముంబై ఎయిర్పోర్ట్లో 29 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.
ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.