Home » Agriculture
ధాన్యం రవాణాపై తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వరి ధాన్యం తరలింపునకు వాహనాలను సమీకరించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా రవాణా అధికారులకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. కూలీల కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా యంత్రపరికరాలను అందిస్తున్నాయి.
ప్రత్తిపాడు ప్రాంతానికి గుంటూరు ఛానల్ చాలా ముఖ్యమైనదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గుంటూరు ఛానల్లో ప్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక పథకాలు తీసుకొస్తున్నా వాటిపై అవగాహన లేకపోవడంతో రైతులు వినియోగించుకోలేకపోతున్నారు. ఈక్రమంలోనే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులపాటు వివిధ అంశాలపై కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈవారం ‘రైతు వారం’గా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా రైతులపై ఎరువుల భారం పడుతోంది. ధరలు మరింత పెరగడంతో అన్నదాతలు దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి ఒకే సారి పంట మద్దతు ధర పెంచుతున్నాయి.
తుమ్మిడిహెట్టిపై బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 150 మీటర్ల ఎత్తుతో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.బ్యారేజి నిర్మించి నేరుగా ఎల్లంపల్లికి గ్రావీటీతో జలాలను తరలించేందుకు యోచిస్తోంది
జిల్లాలో ప్రాజె క్టులు ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో రైతాంగానికి సాగు నీరు అందని పరిస్థితి నెలకొన్నది. దీంతో జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగ దిక్కవుతోంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు అన్ని పెండింగ్లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు.
ధరలు పెరుగుతుండటంతో టమోటా సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. సీజన్తో సంబంధం లేకుండా మండలంలో వేల ఎకరాల్లో టమోటా పంట సాగు చేస్తారు.
అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం లేక పోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.