Home » Adilabad
పార్లమెంట్ ఎన్ని కలు ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలకు తావు లేకుం డా సోమవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఎన్నికల అధికా రులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టడంతో తిరిగి ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఇంతకాలం హోరెత్తించిన మైకులు మూగబోయాయి. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి అభ్యర్థులు తమ ప్రచారాలు ముగించారు. ఏప్రిల్ 18న కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయగా, అదే రోజు నుంచి అభ్యర్థులు ప్రచారాలు ప్రారంభించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణ అన్నారు. శనివారం ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామితో కలిసి చెన్నూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో గని కార్మి కుడికి ఆగర్భ శ్రీమంతుడికి మధ్య పోటీ నెలకొందని పెద్దపల్లి బీఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి హాజరై సభలో ప్రసంగించారు.
మంచిర్యాల, చెన్నూరు, అసెంబ్లీ సెగ్మెంట్ల లో ఈ నెల 13న జరగనున్న పోలింగ్కు ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు.
రామగుండం పోలీస్ కమిష నరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్ని కలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసిన ట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శని వారం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ప్రింట్ ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు వర్కుషాప్ నిర్వహించారు.
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు(Bus Stands, Railway Stations) ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేలమంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్టాండ్లు(Mahatma Gandhi and Jubilee Bus Stands) ప్రయాణికులతో శనివారం రద్దీగా మారాయి.
లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఏప్రిల్ 18న కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల టికెట్లు ఖరారు కావడంతో అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న జరగనున్న పోలింగ్ను పారదర్శకంగా నిర్వహించేలా అధి కారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా కలెక్టర్, ఎన్నికల అధికారులతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తిం చాలని డీసీపీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం గుడిపేట 13వ బెటాలి యన్లో ఎన్నికల విధులకు హాజరవుతున్న పోలీసులకు, శిక్షణార్ధులకు అవ గాహన కార్యక్రమం నిర్వహించారు.