• Home » Adilabad District

Adilabad District

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..

తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.

ఆ గ్రామంలో డీజేలు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ. 50 వేల జరిమానా

ఆ గ్రామంలో డీజేలు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ. 50 వేల జరిమానా

ఇటీవల శుభకార్యాలు, పండగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో డీజే సౌండ్‌తో దద్దరిల్లుతున్నాయి. దీని వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

జనసంద్రమైన నాగోబా..

జనసంద్రమైన నాగోబా..

కేస్లాపూర్‌ నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా ఈ ఏరియాలోని ఆదివాసీలు పెద్దఎత్తున తరలిరావడంతో కేస్లాపూర్ అటవీప్రాంతం కిక్కిరిసిపోయింది. మంత్రి కొండా సురేఖతోపాటు జిల్లా అధికారులు జాతరకు విచ్చేశారు.

ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్‌లో సమాధిని తవ్విన దుండగులు

ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్‌లో సమాధిని తవ్విన దుండగులు

ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్ సమీపంలో దుండగులు ఓ యువకుడి సమాధిని తవ్వి పుర్రెను ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. ఏడాది క్రితం మరణించిన వెంకట్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు సొంత వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. గుర్తు తెలియని దుండగులు వెంకట్ సమాధి తవ్వి పుర్రెను ఎత్తుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 ‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

నగరంలోని గాంధీ ఆసుపత్రిలో యువతికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి అనే యువతి జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన గుండెపోటు, శ్వాస సమస్యలతో బాధపడుతోంది. అయితే.. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు.

Rabid Dog Attacks: పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..

Rabid Dog Attacks: పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..

భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Singareni Tiger: వామ్మో పెద్దపులి.. భయాందోళనలో సింగరేణి కార్మికులు

Singareni Tiger: వామ్మో పెద్దపులి.. భయాందోళనలో సింగరేణి కార్మికులు

సింగరేణిలో పెద్ద పులి సంచరిస్తుండటంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Elections: పల్లెల్లో.. ప్రచార సందడి

Elections: పల్లెల్లో.. ప్రచార సందడి

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచార సందడి కనిపిస్తుంది. తొలివిడత ఎన్నికల గుర్తులు కేటాయించడంతో ప్రచారం మరింతగా ఊపందుకుంటుంది. శనివారం రెండవ విడత ఎన్నికలకు సంబంధించిన గుర్తులను కేటాయించనున్నారు. ప్రస్తుతం మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

kalvakuntla kavitha: రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..?

kalvakuntla kavitha: రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..?

తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? అని కవిత ప్రశ్నించారు. చనాక-కొరటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి