• Home » Adilabad District

Adilabad District

 గంజాయి, డ్రగ్స్‌పై ప్రజలు యుద్ధం చేయాలి: డీజీపీ ఆనంద్

గంజాయి, డ్రగ్స్‌పై ప్రజలు యుద్ధం చేయాలి: డీజీపీ ఆనంద్

పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. రౌడీషీటర్లు తదితర నేరస్తుల విషయంలో కఠినంగానే ఉంటామని హెచ్చరించారు.

సీఎం రేవంత్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

సీఎం రేవంత్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 1వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?

ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?

బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాల యాన్ని (ఆర్జీయూకేటీ) రాష్ట్రంలోని ఇతర సాధారణ విశ్వవిద్యాలయాల తరహాలోనే మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

స్నానం చేయమన్నందుకు మనస్తాపం.. బావిలో దూకిన బాలిక

స్నానం చేయమన్నందుకు మనస్తాపం.. బావిలో దూకిన బాలిక

ఆసిఫాబాద్‌లో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా బాలికను సురక్షితంగా బయటకు తీశారు.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..

తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.

ఆ గ్రామంలో డీజేలు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ. 50 వేల జరిమానా

ఆ గ్రామంలో డీజేలు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ. 50 వేల జరిమానా

ఇటీవల శుభకార్యాలు, పండగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో డీజే సౌండ్‌తో దద్దరిల్లుతున్నాయి. దీని వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

జనసంద్రమైన నాగోబా..

జనసంద్రమైన నాగోబా..

కేస్లాపూర్‌ నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా ఈ ఏరియాలోని ఆదివాసీలు పెద్దఎత్తున తరలిరావడంతో కేస్లాపూర్ అటవీప్రాంతం కిక్కిరిసిపోయింది. మంత్రి కొండా సురేఖతోపాటు జిల్లా అధికారులు జాతరకు విచ్చేశారు.

ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్‌లో సమాధిని తవ్విన దుండగులు

ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్‌లో సమాధిని తవ్విన దుండగులు

ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్ సమీపంలో దుండగులు ఓ యువకుడి సమాధిని తవ్వి పుర్రెను ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. ఏడాది క్రితం మరణించిన వెంకట్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు సొంత వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. గుర్తు తెలియని దుండగులు వెంకట్ సమాధి తవ్వి పుర్రెను ఎత్తుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 ‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

నగరంలోని గాంధీ ఆసుపత్రిలో యువతికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి అనే యువతి జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన గుండెపోటు, శ్వాస సమస్యలతో బాధపడుతోంది. అయితే.. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు.

Rabid Dog Attacks: పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..

Rabid Dog Attacks: పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..

భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి