Home » ABN
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో హైదరాబాద్లో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని ముంబైకు మళ్లించారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
తమ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. వారిలో 59శాతం మంది మహిళలే ఉన్నారని వివరించారు.
మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. అంటే చూడగానే ప్రేమలో పడిపోవడం. అలా ప్రేమించిన వారికి వినూత్న రీతిలో ప్రపోజ్ చేసేందుకు యత్నిస్తుంటారు కొందరు. ఆ సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోవాలని ప్రత్యేకంగా సన్నద్ధమవుతుంటారు. అలాంటి కొన్ని ప్రపోజల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఆ రకమైన స్పెషల్ ప్రపోజల్ ఒకటి మీకోసం...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమయ్యాయి.
విపక్షాల ఆందోళనలతో లోక్సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.
మాసాల్లో మార్గశిరాన్ని నేనంటూ గీతాచార్యుడు శ్రీకృష్ణుడు చెప్పారు. కార్తీక మాసానికి ఎంతటి విశిష్టత ఉందో.. మార్గశిరానికి సైతం అంతే విశిష్టత ఉంది. అలాంటి మార్గశిర మాసంలో గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐటీ కారిడార్కు వస్తున్న ఉద్యోగుల సమయమంతా రోడ్ల పాలవుతోంది. కారిడార్కు చేరుకునే మూడు రోడ్లలోనూ నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటోంది. దీంతో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.
బ్రిటన్లో ఇండియాకు చెందిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. కొందరు వ్యక్తులు చేసిన మూకుమ్మడి దాడిలో అతడు మృతిచెందినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఈ తెల్లవారుజామున వరుస ప్రమాదాలు సంభవించాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఘటనలో ఇంజిన్లో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది.