Home » ABN
సూక్ష్మ సేద్యంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ (APMIP) అమలులో దేశంలోని మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం రికార్డు స్థాయిలో జరిగిందన్నారు.
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్రి కిట్టు వ్యవహారశైలిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం నిడదవోలులో మంత్రి మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1,917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చేపట్టిన స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో రాణిదిహా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా రీల్స్ చేసేందుకు రాప్తి నదికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నదిలో మునిగిపోయారు. వారిలో ఒక విద్యార్థి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే..
రాష్ట్రంలోని పలు మండలాల్లో శనివారం భారీ వడగాల్పులు, వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
అరిదమన్ అనేది ఒక పదం కాదని.. ఒక శక్తి అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. శుక్రవారం విశాఖపట్నంలో భారత్ తన మూడో స్వదేశీ అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ను ఆయన నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ 'క్వేక్ అరినా పబ్' డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గురువారం రాత్రి పబ్లో 64 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలోని తవణంపల్లి మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మొదలపల్లి గ్రామానికి చెందిన లవ కుమార్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగి.. తమ నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.