ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:23 PM
రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని రాజధాని అమరావతిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అమరావతి, ఆగస్టు18: రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని రాజధాని అమరావతిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.
ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి
మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News