• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

షావుకారు జానకి మృతి సినీ లోకానికి తీరని విషాదం: మంత్రి కందుల దుర్గేశ్

షావుకారు జానకి మృతి సినీ లోకానికి తీరని విషాదం: మంత్రి కందుల దుర్గేశ్

ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘షావుకారు’ జానకి మృతి తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణం పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్: షెడ్యూల్‌లో మార్పులు?

భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్: షెడ్యూల్‌లో మార్పులు?

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం.

ప్రియాంక మృతి కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ప్రియాంక మృతి కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

పీజీ వైద్య విద్యార్థి ప్రియాంక మృతి కేసులో నిందితులకు విధించిన రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. నిందితులు సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌లకు 14 రోజుల పాటు కోర్టు శుక్రవారం రిమాండ్ విధించింది.

సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం

సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శుక్రవారం న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు.

ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో భారీగా నగదు సీజ్: ఈడీ

ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో భారీగా నగదు సీజ్: ఈడీ

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్క చూపని రూ.24 లక్షలు సీజ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది.

కుల్‌దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

కుల్‌దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

సభను ఎదుర్కొనే దమ్ములేకే ముఖం చాటేశారు: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

సభను ఎదుర్కొనే దమ్ములేకే ముఖం చాటేశారు: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చకు రావాల్సిన ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండటంపై ప్రశ్నలు సంధిస్తూ.. సభను ఎదుర్కొనే దమ్ములేకే ముఖం చాటేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విషాదం.. కొండపై నుంచి పడి ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

విషాదం.. కొండపై నుంచి పడి ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

ఒక చిన్న మాట.. ఓ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. తండ్రి మందలించాడని కొడుకు కొండపై నుంచి దూకగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా లోయలో పడిపోయాడు. భర్త, కొడుకు ఇద్దరినీ కోల్పోయిన తల్లి.. మనస్తాపంతో తానూ దూకేయడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ASSOCHAM అవార్డు

ఏపీ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ASSOCHAM అవార్డు

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు దక్కింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా రూ.9 వేల కోట్ల నిధులు సమీకరించినందుకు ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డుతో APMDCని సత్కరించారు.

రాయదుర్గం భూముల వేలానికి తొలగిన అడ్డంకులు.. సుప్రీం తీర్పు

రాయదుర్గం భూముల వేలానికి తొలగిన అడ్డంకులు.. సుప్రీం తీర్పు

రాయదుర్గం భూముల వేలానికి మార్గం సుగమమైంది. TGIIC నిర్వహిస్తున్న వేలం ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, వేలం కొనసాగించేందుకు అడ్డంకులు తొలగినట్టయ్యాయి. దీంతో ఈ భూముల వేలం ప్రక్రియ ముందుకు సాగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి