Home » ABN Andhrajyothy
ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్లో తలపడుతుంది. తిరువనంతపురం వేదికగా ఆదివారం.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రిచా ఘోష్ కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు సాధించింది. మ్యాచ్ అనంతరం ఆమె వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడింది.
కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై చర్చించారు.
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో ఎదుర్కొంటున్న వైఫల్యాలకు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించాడు.
అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసి.. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతారంటూ వస్తున్న వార్తలపై మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దాంతో కేబినెట్ సమావేశంలో కొద్ది సేపు నిశబ్దం ఆవరించింది.
ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. మేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్ డ్యాంను బాంబు పెట్టి పేల్చారని ఆయన ఆరోపించారు.
ఆరావళి పర్వత శ్రేణిపై ఒక కమిటీ సిఫార్సులను ఆమోదించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తరువాత, ఆరావళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సుమోటో కేసు ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీం కోర్టులో తాజాగా విచారణలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది న్యాయస్థానం.
టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నాలుగు ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 22 ఏళ్ల యేషే కేవలం 7 పరుగులే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టును కేవలం 45 పరుగులకే ఆలౌట్ చేశాడు.