Home » ABN Andhrajyothy Effect
మొంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో రైల్వే శాఖ రైలు సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి.
కామారెడ్డి వరదల రిపోర్టింగ్లో ఏబీఎన్ నంబర్ 1గా నిలిచింది. సిగాచి కార్మికుల మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. గిరిజన తండాల్లో మరణాల నివారణకు కృషి చేసింది. ఆక్రమణదారులను రోడ్డుకీడ్చిన ఘనత కూడా ఏబీఎన్కే దక్కింది..
ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు. ఈ సందర్భంగా ఆందోళన పడవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
నదీ నీటి పంపకాలతోపాటు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఈ తరహా ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ ఆయనకు ఉత్తమ్ సూచించారు.
NTTPS కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు కొసాగుతున్నాయని కూటమి నేతలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు.
అమరావతిలోని సీఆర్డీఏ భవన పనులు నత్తనడకన కొనసాగుతోండటంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనంతో అధికారులు స్పందించి సీఆర్డీఏ భవన పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం లభించింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో సీటు రాక చదువుకు దూరమైన విద్యార్థిని మీనుగ జెస్సీ పొలం పనులు చేస్తోంది. విద్యార్థిని మీనుగ జెస్సీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
అధికారులతో మాట్లాడి చిట్టితల్లిని.. కేజీబీవీలో సీటు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు.. పత్తి చేనులో మగ్గిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పుప్పాలగూడలోని రూ.వేల కోట్ల విలువైన కాందిశీకుల భూములు అన్యాక్రాంతం అవడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో అధికారయంత్రాంగం కదిలింది.
తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.