2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులు భారత్కే దక్కాయి. అహ్మదాబాద్ వేదికగా ఈసారి కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. దీని కోసం నైజీరియాలోని అబుజా పోటీ పడగా.. ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ వైపే మొగ్గు చూపింది.
భారత మాజీ క్రికెట్ పుజారా బావమరిది బుధవారం రాజ్కోట్లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత వారంలో టాప్ ప్లేస్కు వచ్చిన డారిల్ మిచెల్.. ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయాడు.
సౌతాఫ్రికాతో వైట్వాష్కు గురయ్యాక టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్లో మరింత కిందకి దిగజారింది. నాలుగో స్థానంలో ఉన్న భారత్.. ఈ ఓటమి తర్వాత ఐదో స్థానానికి పడిపోయింది. మన కంటే ముందు స్థానంలో పాకిస్తాన్ జట్టు కొనసాగుతోంది.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా సొంతగడ్డపై వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? అనే చర్చ మొదలైంది. నెలల వ్యవధిలోనే టీమిండియా సిరీస్లు ఓడిపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాన కోచ్ గంభీర్ దీనికి కారణమనే చర్చ నడుస్తోంది.
గువాహటి టెస్టులో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు గెలిచి 2-0తో ఆతిథ్య భారత్ను క్లీన్ స్వీప్ చేసింది. జట్టు విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడాడు.
టీమిండియా సౌతాఫ్రికాపై 2-0 తేడాతో క్లీన్ స్వీప్నకు గురైంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన భవిష్యత్పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని వెల్లడించాడు. ఈ పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా? లేదా? బోర్డు డిసైడ్ చేస్తుందని తెలిపాడు.
గువాహటి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు ఓడటంతో సఫారీలపై భారత్ వైట్వాష్కు గురైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా టెస్ట్ తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆతిథ్య భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. గువాహటిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్షిణాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది. ఈ మ్యాచ్లో భారత్పై సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
గువాహటి టెస్ట్లో భారత్ ఓటమి అంచున ఉంది. 27/2 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా చకచకా వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీ విరామ సమయానికి 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ స్కోర్..