తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ బృందం ఆధ్వర్యంలో కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్లో విజయవంతంగా CPR & AED శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
జర్మనీలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. జర్మనీ నుంచే కాక ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వైట్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న భారత సంతతి ప్రముఖ టెక్ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ జూన్ నెలాఖరున తాను వైట్హౌస్లోని తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
గల్ఫ్లో సీబీఎస్ఈ పరీక్షల రద్దుతో వేలాది ప్రవాస భారతీయ విద్యార్థుల ఉన్నత విద్య అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రత్యేక పరీక్షలు నిర్వహించడం లేదా గ్రేస్ మార్కులు కేటాయించడం వంటి చర్యలతో విద్యార్థులను ఆదుకోవాలని ఎన్నారై టీడీపీ నాయకులు కోరారు.
మెల్బోర్న్ మహానాడు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ హరీశ్ గంటి మెల్బోర్న్కు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మెల్బోర్న్ నాయకులు, కార్యకర్తలు, ఆయన స్నేహితులు ఘన స్వాగతం పలికారు.
మెరుగైన ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే అనేక మంది క్రమేణా కుటుంబ సమేతంగా సుదీర్ఘ కాలం పాటు అక్కడ నివసిస్తుంటారు. ఈ క్రమంలో ఆ విదేశీగడ్డపై పుట్టిపెరిగే చిన్నారులు ఆప్యాయత, అనురాగాల లేమితో యాంత్రికంగా కాలం వెళ్లదీస్తున్నారు.
అమెరికా రాజధాని పరిధిలో భానుప్రకాశ్ మాగులూరి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం.. రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులును ఘనంగా సత్కరించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని తానా నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తెలిపారు. ప్రాణాలను కాపాడే ఈ గొప్ప కార్యక్రమానికి 40 మందికి పైగా దాతలు సహకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల వ్యవహారాలపై అవగాహన కల్గిన దౌత్యవేత్త విపుల్ ను సౌదీ అరేబియాలో నూతన రాయబారిగా భారత ప్రభుత్వం నియమించింది.
అమెరికాలోని న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన పికిల్బాల్ టోర్నమెంట్ ఘన విజయం సాధించింది. వివిధ ప్రాంతాల నుంచి పికిల్బాల్ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు.