ఖతర్లోని తెలంగాణ ప్రముఖురాలు నందిని అబ్బగౌనికి నారీ శక్తి సమ్మాన్ అవార్డు దక్కింది. ఖతర్-భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చేసిన కృషిని గుర్తిస్తూ నందినిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బహ్రెయిన్లో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వైభవంగా సాగాయి. ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యనారాయణుడి నామస్మరణతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు
సీనియర్ నాయకుడు కోమటి జయరాంని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. రెండవసారి ఆయన ఈ పదవి ద్వారా సేవలు అందించనున్నారు..
అమెరికా ప్రభుత్వం మరో షాకిచ్చింది. వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచినట్టు ప్రకటించింది. కొత్త చార్జీలు మార్చ్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ యువ వాలంటీర్లు భారీ స్థాయిలో ఆహారాన్ని విరాళంగా సేకరించి అవసరమైన వారికి అందజేశారు. 7 వేల పౌండ్ల ఆహారాన్ని అందించి రికార్డు సృష్టించారు.
అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తెలుగు విద్యార్థి కనిపించకుండా పోయారు. గుంటూరుకు చెందిన హరి కృష్ణా రెడ్డి ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు..
ఏపీలో ఓఎన్జీసీ పైప్లైన్ లీకైన ఘటన గల్ఫ్లోని ప్రవాసీయుల్లో కలకలానికి దారి తీసింది. పైప్లైన్ లీకైన మలికిపురం మండలానికి చెందిన అనేక మంది గల్ఫ్లో పని చేస్తున్నారు. ఘటన గురించి తెలియగానే తమ వారు ఎలా ఉన్నారో అని కంగారు పడుతూ స్థానికులకు ఫోన్ చేశారు.
లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం, డైరెక్టర్ మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం స్థానిక సాయిబాబా మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగువారు హాజరై కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. వీరి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికాలో భారత సంతతికి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నికితా గోడిశాల అనే యువతి గత వారం నుంచి కనిపించకుండా పోయింది. తాజాగా ఆమె మృతదేహం ఒకప్పటి స్నేహితుడు అర్జున్ అపార్ట్మెంట్లో లభ్యమైంది.