కెనడాలో చదువుకుంటున్న భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడి కాలేజీకి చెందిన 10-12 మంది దాడి చేసి పొట్టన పెట్టుకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని వీకే ఫంక్షన్ హాల్లో తానా ఆధ్వర్యంలో జరిగిన ‘రైతు కోసం’ కార్యక్రమంలో వెయ్యి మంది అన్నదాతలకు పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లను పంపిణీ చేశారు.
గల్ఫ్ దేశాలలో జనసైనికులు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సేవాకార్యక్రమాలను నిర్వహించారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆర్భాట కార్యక్రమాలకు బదులుగా సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
అల్ఫారెట్టాలో ‘నాట్యాంజలి – 2026’ పేరుతో నిర్వహించిన వార్షిక కూచిపూడి నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మూడు సేవా సంస్థల కోసం నిధులను సమీకరించారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన వారి బంగారం దుకాణంపై ఓ సాయుధ ముఠా మెరుపు దాడి చేసింది. సినిమా ఫక్కీలో కేవలం 70 సెకన్ల వ్యవధిలోనే దుండగులు సుమారు రూ.16 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.
సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాసాంధ్రులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదరభావాన్ని ప్రతిబింబించారు.
బాల్టిమోర్లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా మహాసభలకు మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ను ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ ఆహ్వానించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ను కూడా సభలకు ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించినట్లు ఆటా తెలిపింది.
డల్లాస్ సమీపంలోని సౌత్లేక్కు చెందిన ప్రవాసాంధ్ర బాలిక గుళ్లపల్లి శాన్వికి ఆర్థిక అంశాలపై చిన్నప్పటి నుండి ఆసక్తి మెండు. తన అభిరుచితో నేర్చుకున్న విజ్ఞానాన్ని అమెరికాలోని పిల్లలకు ఆర్థిక పాఠాలుగా బోధిస్తుంది.
క్రైస్తవ ధార్మిక సదస్సు కోసం బహ్రెయిన్కు వెళ్లి ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగు క్రైస్తవ బోధకులు తాము మాతృభూమికి చేరాలంటూ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రార్ధనలు ఫలించాయి. త్వరలో వారు భారత్కు చేరుకోనున్నారు.