చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
‘డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి’ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి ఎంపికయ్యారు. డల్లాస్లో అత్యంత ప్రభావవంతమైన తెలుగు సంస్థకు అధ్యక్షురాలిగా వరుసగా మూడవసారి ఒక మహిళే ఎన్నిక కావడం విశేషం.
రియాధ్లో తెలుగు ప్రవాసీయుల సంఘం టాసా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక ప్రవాసీ కుటుంబాలు పాల్గొన్నాయి.
కువైత్లో మృతి చెందిన తెలుగు మహిళల ఆభరణాల కాంట్రవర్సీ మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చిన తెలుగు ప్రముఖుడు తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పాటలు, ఆటల పోటీలు వంటి కార్యక్రమాలు ఎన్నారైలను అలరించాయి.
న్యూజెర్సీలో జరిగిన నారీ శక్తి కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు మాధవీ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం విశిష్టత గురించి ప్రసంగించారు. ధర్మ పరిరక్షణలో మహిళ పాత్ర గురించి పేర్కొన్నారు.
మెల్బోర్న్లో ఎన్నారైలు సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
న్యూజెర్సీలోని ఎన్నారైలతో నేడు తెలంగాణ బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో డాలస్లో కూడా ఆమె పర్యటిస్తారని జీహెచ్హెచ్ఎఫ్ అధ్యక్షుడు తెలిపారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. డాలర్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రమాణస్వీకారం చేశారు. తనకీ బాధ్యత అప్పగించిన సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.