కువైట్లోని తెలుగుదేశం, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఛార్లెట్లో (యూఎస్ఏ) ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.
దుబాయి రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు తెలంగాణ ప్రవాసీయుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన యూఏఈ వ్యాపారవేత్త, బర్జీల్ సంస్థ చైర్మన్ డాక్టర్ షంషీర్ వయలీల్కు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు.
డెన్మార్క్లో మినీ మహానాడు, ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు ప్రముఖ ప్రవాసీ భారతీయుడు, మలయాళీ వ్యాపారి అండగా నిలిచారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్థికసాయం ప్రకటించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి మార్గదర్శకత్వంలో.. తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 500 మంది భక్తులు, వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగింది.
దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు ఉన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం కమ్యూనిటీ కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఆటల పోటీలను తానా ప్రారంభించింది. అందులో భాగంగా కన్నపోలిస్లోని కరోలినా పికిల్బాల్ క్లబ్ వేదికగా నిర్వహించిన తానా పికిల్బాల్ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది.
అమెరికాలో తెలుగు విద్యార్థిని మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఫ్లోరిడాలోని స్టెయిన్బ్రెన్నర్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది.
సింగపూర్లోని భారత హైకమిషన్లో పాస్పోర్ట్ ఆఫీసర్గా సేవలందించి, బదిలీపై స్వదేశానికి వెళ్తున్న వై.ఎస్.వి.ఎస్. ఆర్. కృష్ణకు, శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఘనమైన సన్మాన కార్యక్రమం, ఆత్మీయ సమ్మేళనం జరిగింది.