పికిల్ బాల్ టోర్నమెంట్ను తానా విజయవంతంగా నిర్వహించింది. క్రీడలు దైనందిన జీవితములో ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్ని దిగ్విజయముగా నిర్వహించామని తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు ఖతర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయిన భారత ఎంబసీ దౌత్యవేత్త, ప్రథమ కార్యదర్శి ఈశ్ సింఘాల్ స్థానిక తెలుగు సంఘాలు అభినందించారు. తెలుగు సంస్కృతికి తరువాతి తరాలకు అందించేందుకు సంఘాలు పలు సేవ, సాంస్కృత్రిక కార్యక్రమాలు చేస్తున్నాయని ప్రశంసించారు.
దుబాయిలో శనివారం సాయంత్రం డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ సేవా సమితి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మహానుభావుడి సేవలు, స్ఫూర్తిదాయక భావాలు, సామాజిక న్యాయానికి చేసిన కృషిని స్మరించుకోవాలని అన్నారు.
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు.
ఏపీకి, తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారని తెలిపారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో తక్షణం స్పందించి తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఏపీలో పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే అమెరికాలోని డల్లాస్లో పర్యటిస్తున్నారు.
టొరంటోలో ఫ్యామిలీ ఫెస్ట్ ఈవెంట్ వైభవంగా జరిగింది. కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 800లకు పైగా తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి.
ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ వచ్చేనెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడి తెలుగు ఎన్నారై కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. ఏపీలోకి పెట్టుబడులు లక్ష్యంగా లోకేష్ పర్యటన ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ వింగ్తో లోకేష్ ఆత్మీయ భేటీ జరుపనున్నారు.
సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్లో అత్యంత ఉత్సాహభరితంగా రెండు వారాల పాటు జరిగిన తెలుగు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఇటీవల ముగిశాయి. దమ్మాం, అల్ ఖోబర్, ఇతర ఈశాన్య ప్రాంతాలకు చెందిన మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొనగా తెలుగు ఫైటర్స్ విజేతగా దక్కన్ చార్జర్స్ రన్నర్ అప్గా నిలిచాయి.
డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పలువురు దాతలు విరాళాలను అందించారు.