ఏపీ సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకో సిస్టమ్ కలిగి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.
తెలుగు ప్రవాసీ సంఘం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గం కోలువుదీరింది. పలు సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించి తమ కార్యకలాపాలకు నాంది పలికింది. ఈ ఈవెంట్లో కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలుగు కళా సమితి (టి.కె.యస్) సేవలను ప్రశంసిస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం సంస్థ ప్రతినిధులను సగౌరవంగా సత్కరించింది. తమ సేవలకు గుర్తింపుగా వారు జ్ఞాపికలను అందుకున్నారు.
ఎమ్ఈఎస్యూ సేవల విస్తరణ కోసం శంకర నేత్రాలయ యూఎస్ఏ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియాలోని కమ్మింగ్లోగల వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో 1.625 మిలియన్ డాలర్ల సమీకరణ చేశారు. పలువురు ప్రముఖులను ఈవెంట్ నిర్వాహకులు సత్కరించారు.
పికిల్ బాల్ టోర్నమెంట్ను తానా విజయవంతంగా నిర్వహించింది. క్రీడలు దైనందిన జీవితములో ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్ని దిగ్విజయముగా నిర్వహించామని తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు ఖతర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయిన భారత ఎంబసీ దౌత్యవేత్త, ప్రథమ కార్యదర్శి ఈశ్ సింఘాల్ స్థానిక తెలుగు సంఘాలు అభినందించారు. తెలుగు సంస్కృతికి తరువాతి తరాలకు అందించేందుకు సంఘాలు పలు సేవ, సాంస్కృత్రిక కార్యక్రమాలు చేస్తున్నాయని ప్రశంసించారు.
దుబాయిలో శనివారం సాయంత్రం డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ సేవా సమితి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మహానుభావుడి సేవలు, స్ఫూర్తిదాయక భావాలు, సామాజిక న్యాయానికి చేసిన కృషిని స్మరించుకోవాలని అన్నారు.
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు.
ఏపీకి, తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారని తెలిపారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో తక్షణం స్పందించి తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఏపీలో పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే అమెరికాలోని డల్లాస్లో పర్యటిస్తున్నారు.