ఖతర్ నుంచి వచ్చిన ఎన్నారై పంచిత ధర్మరాజు యాదవ్ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ప్రజలు విజ్ఞులని, అభివృద్ధి ఎజెండాను అర్థమయ్యే రీతిలో వివరిస్తే గెలిపిస్తారని ఆయన అన్నారు.
ప్రవాసీయులలో పురస్కారం ప్రహసనంగా మారిపోయింది. శాలువా సత్కారాలు ప్రస్తుతం విలువ కోల్పోతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఖతర్లోని తెలుగు ఇంజనీర్ల ఫోరం ఆవకాశాలు, అనుభవాలు, అభ్యర్థులకు మధ్య గత నాలుగు సంవత్సరాలుగా ఒక వారధిగా వ్యవహరిస్తోంది. యం.ఇ.పి, యు.డి.పి.ఎ గుర్తింపునకు సంబంధించి చట్టపరమైన సమస్యను పరిష్కరించడంలో తెలుగు ఇంజనీర్ల ఫోరం కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రఖ్యాత కథా, నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు అయిన తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ శనివారం ఘనంగా నిర్వహించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇంటర్నెట్ ద్వారా ఈ సంస్మరణ సభను నిర్వహించారు.
తన భర్త మరో మహిళను వివాహమాడి ఆంధ్రాలో తలదాచుకున్నాడని ఓ కేరళ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆంధ్రలో ఎక్కడుంటున్నాడో తెలియని అతడిని ఆచూకీని తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది.
సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కార్యక్రమం జరిగింది. దాతలు అనేక మంది ఈ కార్యక్రమంలో నిధులను అందించారు.
పంచాయతీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రవాసీయులు అనేక మంది స్వదేశానికి వచ్చారు. పక్కా వ్యూహంతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఇతర అభ్యర్థులకు గట్టిపోటీని ఇస్తున్నారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఏపీ సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకో సిస్టమ్ కలిగి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.
తెలుగు ప్రవాసీ సంఘం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గం కోలువుదీరింది. పలు సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించి తమ కార్యకలాపాలకు నాంది పలికింది. ఈ ఈవెంట్లో కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.