విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం నుంచి భారత్కు ఉపశమనం లభిస్తోంది. కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దాటి భారత్కు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా సరిహద్దుల్లో తెలుగు గంగ కాలువల్లో మరమ్మతుల కారణంగా నగరానికి కృష్ణా జలాల విడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెన్నై మెట్రోవాటర్ బోర్డ్ ప్రకటించింది.
భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాలుగా మారిన నక్సలిజం సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(శనివారం) నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం జేవర్ సమీపంలో రూ.11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్-1 దశను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు.
పుదుచ్చేరి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడైన ఏవీ సుబ్రమణియన్ పార్టీలోని తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు.
జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది.
మహరాష్ట్ర చంద్రాపూర్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉండి కన్నతండ్రినే చంపేసింది ఓ యువతి. ప్రేమకు అడ్డు చెప్పాడని ఏకంగా ప్రాణాలే తీసేసింది.
హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ కారిడార్లలో రైల్వే భూములు ఆక్రమణలకు గురవుతుండడంపై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆపరేషన్ కగార్లో తుది అంకం మొదలైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్ బెస్రా అలియాస్ సునీల్ లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి.