సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే మందుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. రైతులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు.
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు, వారు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా రూ.50,000 సాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలో పవర్ఫుల్ ఇండియన్స్ (శక్తిమంతమైన భారతీయులు) జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించిన వంద మంది శక్తిమంతమైన భారతీయుల జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానాన్ని పొందారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు కనీసం మాంసం, గుడ్లు తినే పరిస్థితి కూడా ఉండదని అన్నారు.
కేరళలో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పర ప్రత్యర్థులుగా కనిపిస్తూ, వంతులవారిగా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందినట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని, యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం అందజేస్తామని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం హామీ ఇచ్చింది.
ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందన్న కోపంతో మహిళను హత్య చేసింది ఓ మాజీ పని మనిషి. డ్రగ్స్ ఇచ్చి మరీ ప్రాణాలు తీసింది. గుజరాత్లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఎన్నో దేశాలు ఇంధన, వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంకలో చమురు సంక్షోభం మరింత ఎక్కువగా ఉంది.
లైంగిక దాడులకు గురైన బాధితుల ఆత్మగౌరవాన్ని, గోప్యతను కాపాడాల్సిన విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.