జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు..
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుపొందారని మంత్రి పొన్నం అన్నారు. సెంటిమెంట్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ నేతలకు అనుభవముందంటూ వ్యాఖ్యలు చేశారు.
జూబీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది.
3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు కాగా.. 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మూర్ఖుడు అయితే.. ఆయన కొడుకు కేటీఆర్ ఇంకా పెద్ద మూర్ఖుడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్కు లేదన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తులం బంగారం ఇవ్వడం కాదు.. ఉన్న బంగారాన్ని గుంజుకెళ్తారని విమర్శించారు.
అశ్వారావు పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన చాలా వినూత్నంగా ప్రచారం చేశారు. చికెట్ కొట్టి, పాడ పాడారు.
బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి.
తొలి విడత పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాల్లో అందరి దృష్టి ప్రధానంగా వైశాలి జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంది. ఇక్కడి నుంచి ఆర్జేడీ నుంచి 'మహాగఠ్బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు.
కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ బంధువు అయిన జ్యోతి మాంఝీ ఓపెన్ జీప్లో సిల్బట్టా ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొందరు ఆమెపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఒక రాయి ఆమెకు తగలడంలో గాయపడ్డారు.