హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఒక్కరోజే సైబర్ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్రాయి.
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్కు చెందిన హోటల్ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హనీమూన్లో నెలసరి వచ్చినందుకు తనపై భర్త దాడి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. 2023లో ఈ ఘటన జరగ్గా పోలీసులు ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది.
ప్రేమ పేరుతో వేధిస్తూ తన వెంట రావాలని ఓ యువకుడు ఒత్తిడి చేయగా ఆ విద్యార్థిని నిరాకరించింది. దీంతో ఆమెపై బ్లేడ్తో దాడిచేసి గాయపరిచాడు.
బెంగళూరులో దంపతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. సివిల్ ఇంజినీర్ సుమంత్ జైన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పద్మావతి మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది.
వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలతో బహుళ భారతీయ పాస్పోర్టులు తీసుకొని అమెరికా వీసా కోసం ప్రయత్నించిన వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు.
సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిం దితుడు బొల్లా కిరణ్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సమీపంలో ఓ వివాహిత(24) దారుణ హత్యకు గురైంది. ఓ వ్యక్తి ఆ వివాహితపై అత్యాచారం చేసి.. అనంతరం మరో వ్యక్తితో కలిసి ఆమెను చంపి, మృతదేహాన్ని తగులుబెట్టాడు.
ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారే కాజేశాడు.. మరో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో దాన్ని కుదువపెట్టి వచ్చిన సొమ్మంతా సొంతానికి వాడేసుకున్నాడు.
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్పార్కు (కేఎంటీపీ)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గీసుగొండ మండలం శాయంపేటహవేలి శివారులో..