పైకి చూస్తే అన్నీ సిమెంట్ బస్తాలే కనిపిస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే వాటి వెనుక గంజాయి ప్యాకెట్లు దర్శనమిస్తాయి. సిమెంట్ లోడులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమెను వెంటనే 108 అంబులెన్స్లో తిరువణ్ణామలై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ సుధాకర్, డీఎస్పీ సతీష్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు.
ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.
భోజనం చేశాం.. అయితే మాకే బిల్లు ఇస్తావా..అంటూ పోలీసులు ఓ మాజీ సైనికుడిపై విరుచుకు పడ్డారు. ధారవాడలో హోటల్ నిర్వహిస్తున్న మాజీ సైనికుడిని పోలీసులు చితకబాదిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 11గంటలకు సప్తపుర లే అవుట్ వివేకానంద సర్కిల్లో పోలీసులు భోజనం చేసేందుకు వెళ్లారు.
మాజీ ప్రియురాలిని మర్చిపోలేక మనో వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇక మళ్లీ చేయను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అతను (సినీనటికి కాబోయే భర్త) ఆత్మహత్య చేసుకున్నాడు.
క్రికెట్ మ్యాచ్ చూసి అర్ధరాత్రి బైక్పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు డివైడర్ను ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలుకాగా ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
కూకట్పల్లి బాలాజీ నగర్లో తండ్రి వాచ్మన్గా విధులు నిర్వహిస్తుండగా కొడుకు అదే అపార్టుమెంటులో దొంగతనాలు చేస్తూ ఏడాది కాలంగా పోలీసులకు సవాల్ విసిరిన కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుక్కను బెదిరించాడన్న కోపంతో తండ్రీకొడుకులు ఓ బాలుడిపై దాడిచేశారు. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్ కోదండరాంనగర్ కాలనీకి చెందిన దాసరి సాయి(17) ఆదివారం రాత్రి 9.30 గంటలకు కర్రీ పాయింట్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
పెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మేర మోసం చేసిన నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ముత్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చందానగర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అఖిల్కు పెట్టుబడికి 30 నుంచి 48 శాతం వరకు వార్షిక రాబడి ఇస్తామని నమ్మించి కొందరు డిపాజిట్లు సేకరించారు.
ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ.12.56 లక్షలను కాజేశారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగంబజార్కు చెందిన 25 ఏళ్ల యువకుడు సెప్టెంబరు ఒకటిన ఇన్స్టాగ్రాంలో ఆన్లైన్ ట్రేడింగ్ యాడ్ను చూశాడు.