Maoist leader 'Chelluru' joins the mainstream of public life దేశంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఇంటిలో బిక్కుబిక్కుమంటూ గడిపేవాళ్లం. ఎప్పుడు ఎటువంటి వార్త వస్తుందో అన్న ఆందోళన ఉండేది. సోమవారం సాయంత్రం విజయవాడలో డీజీపీ ఎదుట తన తమ్ముడు లొంగిపోయాడని, జనజీవన స్రవంతిలో కలిశాడనే సమాచారం తెలిసి ఎంతో ఆనందపడుతున్నామని.. మావోయిస్టు నేత చెల్లూరు నారాయణరావు పెద్దన్నయ్య చెల్లూరు సింహాచలం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
తమకు న్యాయం చేయకుంటే ఐక్యంగా పోరాడుతామని నందిగాం మండలంలోని గిరిజనులు స్పష్టంచేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఎస్టీలను తక్కువచేసి మాట్లాడడం తగదని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి ఊరుబడిని కాపాడుకుందామని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బాలక శంకరరావు పిలుపునిచ్చారు.
YCP's enthusiasm for 'Chalo Moolapet Port' ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు నిర్వహించిన ‘చలో మూలపేట పోర్టు’ కార్యక్రమం.. ఆద్యంతం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు భజనగానే సాగింది. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడా మూడురోడ్లు కూడలిలో నిర్వహించిన ఈ కార్యక్రమం.. అబద్దాలు, అసత్య ప్రచారాలతోనే ముగిసింది.
ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాల యాన్ని మరోచోటుకు తరలించవద్దని హిరమండలం పంచాయతీలోని వ్యాపారులు, స్థానికులు కోరారు.
కూటమి ప్రభుత్వ హయంలోనే గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేసినట్లు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలి పారు. సోమవారం కిళ్లాంలో సీసీరోడ్డును ప్రారంభించారు.
False propaganda on port works ‘రాజకీయ మనుగడ కోసం వైసీపీ నాయకులు పాకులాడుతున్నారు. ఈక్రమంలో మూలపేట పోర్టు పనుల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నార’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇటీవల తీసు కువెళ్లి మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కింజరా పు అచ్చెన్నాయుడు తెలిపారు.
New houses opened in the srikakulam జిల్లాలో 1112 గృహాలకు రూ.13.32 కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళంలోని 44వ డివిజన్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన గృహాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్, లబ్ధిదారుడితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
Tribute to the pioneers దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన పీ-4 పథకం పేదరిక నిర్మూలనకు దిక్సూచిగా మారిందని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పీ-4 కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలోని బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో మార్గదర్శకులకు సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.