మొంథా తుఫాన్ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ పంపిణీలో జాప్యంపై టెక్కలి మత్స్యశాఖ ఎఫ్డీవో ధర్మరా జు పాత్రోను సభ్యులు నిలదీశారు.
రైతే దేశానికి వెన్నెముకని ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, మామిడి గోవిందరావు అన్నారు.
Collecting money in the form of commissions ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారీలు, మిల్లర్ల దందా కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు వెళ్లాల్సిన పనిలేదు. శాంపిల్స్ బాధ ఉండదు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర జమవుతుంది. కానీ 80 కేజీల బస్తాకు రూ.100 నుంచి రూ.200 దళారీలు తీసుకునేందుకు, మిల్లర్లకు అదనంగా 2 కేజీల నుంచి 5 కేజీల ధాన్యం ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.
Traffic will be blocked in case of floods వర్షం కురిస్తే చాలు.. ఆ మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. నిచ్చప్పల గెడ్డ పొంగి ప్రవహించి.. బాహ్య ప్రపంచంతో గ్రామస్థులకు సంబంధాలు తెగి పోతాయి. ఎవరికి అనారోగ్యం వచ్చినా.. అత్య వసర వైద్యం అందించాల్సి ఉన్నా.. వరదనీరు తగ్గేవరకు బయటకు రాలేని పరిస్థితి. ఇదీ మెళియాపుట్టి మండలంలోని పెద్దరోకళ్లపల్లి, రామ్నగర్, సీతారామపల్లి గ్రామస్థుల దుస్థితి.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడే దళారీ వ్యవస్థ నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే, పీయూసీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
Investigation against three officers సీతంపేట ఐటీడీఏలో ముగ్గురు అధికారుల అవినీతి, అక్రమాలపై విచారణకు రంగం సిద్ధమైంది. ఐటీడీఏ పరిధిలో జరిగిన అక్రమాలపై దళిత సంఘాల జేఏసీ ఫిర్యాదు మేరకు ఈ నెల 26న విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ డైరెక్టర్ ఆదేశించారు.
పార్టీ కోసం నిబ ద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించేందుకు ఆలిం డియా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని ఏఐసీసీ కార్యదర్శి సూరత్సింగ్ ఠాకూర్ అన్నారు.
‘For you, farmer.’ కేవలం వరిసాగు కాకుండా ఉద్యాన, వాణిజ్య పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ‘రైతన్న మీ కోసం’ వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఎచ్చెర్ల మండలం పొన్నాడలో ఆయన పర్యటించారు. పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గం నాలుగు మండలాల్లో సుమారు 400 మంది ఒడ్డి కులస్థులున్నామని, కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం తో ఇబ్బందులు పడుతున్నామని, తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఒడ్డి కులస్థులు వేడుకున్నారు.
నౌపడ ప్రాంతంలో ఇటీవల కనిపించిన వివాహిత మృతదేహానికి సంబంఽ దించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుని అదుపులోకి తీసుకున్నట్టు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు విలేకరులకు తెలిపారు.