• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

రూ.900 కోట్లతో వీఎంఆర్‌డీఏ బడ్జెట్‌

రూ.900 కోట్లతో వీఎంఆర్‌డీఏ బడ్జెట్‌

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.900 కోట్లతో బడ్జెట్‌ రూపొందించిందని, బోర్డు సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకోవలసి ఉందని కమిషనర్‌ తేజ్‌ భరత్‌ వెల్లడించారు.

వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి

వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి

సీలేరు వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టు నిర్మిస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు గురువారం ఇక్కడి ఏపీ జెన్‌కో కల్యాణమండంలో వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సభ జరిగింది.

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు తొలిసారిగా బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టింది. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించి కార్పొరేట్‌ స్థాయి విద్యాబోధన అందిస్తున్నారు. నూతన విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సీలేరు కాంప్లెక్సులో జోరుగా విద్యుదుత్పత్తి

సీలేరు కాంప్లెక్సులో జోరుగా విద్యుదుత్పత్తి

సీలేరు కాంప్లెక్స్‌లోని అన్ని కేంద్రాల్లో జలవిద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతున్నదని చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు. సీలేరు పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఇక్కడ ఏపీ జెన్‌కో అతిథిగృహంలో అధికారులతో సమావేశం అయ్యారు

పంచాయతీల్లో ప్రత్యేక పాలన

పంచాయతీల్లో ప్రత్యేక పాలన

గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. సుమారు ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో గెలుపొంది, పదవీ బాధ్యతలు చేపట్టిన పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం గురువారంతో ముగిసింది. వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు మండల స్థాయిలో గజిటెడ్‌ అధికారులను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఆమోదం లభించడంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

జయహో అమరావతి

జయహో అమరావతి

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో గురువారం జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి.

కొనసాగుతున్న పొగమంచు

కొనసాగుతున్న పొగమంచు

వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో పొగమంచు కొనసాగుతున్నది. గురువారం తెల్లవారుజామున నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు పొగమంచు కమ్మేసింది. వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా, రాత్రి వేళల్లో చలి ప్రభావం చూపుతున్నది. గురువారం అరకులోయలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా చింతపల్లిలో 17.4, కొయ్యూరులో 19.9, అనంతగిరిలో 21.2 డిగ్రీలు నమోదయ్యాయి.

జయహో అమరావతి

జయహో అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి జల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు. కేకులు కట్‌ చేసి మిఠాయిలు పంచారు.

గిరిజనులతో స్నేహంగా మెలగండి

గిరిజనులతో స్నేహంగా మెలగండి

‘గిరిజన ప్రాంతంలో పని చేయడం పనిష్మెంటు కాదు. అదృష్టంగా భావించి వారికి సేవలందించినప్పుడే మనం చేసే ఉద్యోగానికి సార్థకత లభిస్తుంది’ అని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. ఏపీఐఐసీ ఎండీగా బదిలీ అయిన సందర్భంగా కలెక్టరేట్‌లో గురువారం ఆయనకు వీడ్కోలు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, విధి నిర్వహణలో పారదర్శకత ప్రధానమని, గిరిజనులతో స్నేహ పూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.

సాగర్‌నగర్‌లో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం రేపు

సాగర్‌నగర్‌లో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం రేపు

సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు/అధికారులు, ప్రజలకు మధ్య వారధిగా ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించతలపెట్టిన ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ఈనెల నాలుగో తేదీ (శనివారం)న నగరంలోని భీమిలి నియోజకవర్గ పరిధిలో గల సాగర్‌నగర్‌లో జరగనున్నది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి