When Will They Change It? జిల్లాలో చాలాచోట్ల ఇంకా గ్రామ సచివాలయాల పేర్లు మారలేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా గ్రామ పంచాయతీ లను గ్రామ సచివాలయాలుగా మార్చింది. అవసరాన్ని మించి సిబ్బందిని నియమించి తీవ్ర విమర్శల పాలైంది.
Oh God… Who Will Stand By Us Now! కొన్నాళ్ల కిందట తండ్రి చనిపోవడంతో ఆ యువకుడు ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే స్నేహితుడి తల్లి వర్ధంతి కోసమని రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. పనుల నిమిత్తం బైక్పై వెళ్లిన ఆ యువకుడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీ కొన్న ఘటనలో ఆ యువకుడు మృత్యువాత పడ్డాడు.
నగరంలోని టీడీపీ జిల్లా కార్యాల యంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి 170 వినతులను స్వీకరించారు.
తోటాడ- అక్కివరం పరిధిలోని భూములపై కొందరు వైసీపీ నాయకులు పన్నిన కుట్రలు, చేస్తున్న బ్లాక్ మెయి ల్ రాజకీయాలపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ భూ ములతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక్క అంగుళం భూమి ఆక్రమించినట్లు నిరూపించినా తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.
జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిం చి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.తులసీదాస్ డిమాండ్ చేశారు.
హెచ్ఐవీ, ఎయిడ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు.
పార్టీ బలోపేతానికి డిజిటల్ వేదికలు కీలక సాఽధనాలుగా మారిన తరుణంలో కనిగిరికి గుర్తింపు తీసుకు వచ్చేలా ర్యాంకులు సాధించటం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.
పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత ఉంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించారు.
గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. ఆదివా రం గిద్దలూరు మండలం కెఎ్సపల్లి పం చాయతీ పరిధిలోని పెద్దచెరువు గ్రామం లో రూ.30లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే అశోక్రెడ్డి ప్రారంభించారు.
ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనాలను నిఘా నేత్రాలు పట్టేస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతున్నవారిని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు గుర్తిస్తున్నాయి. నంబరు ప్లేట్ ఆధారంగా కేసులు నమోదవుతున్నాయి.