ప్రస్తుత కాలంలో డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యాసంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలని సూచించారు.
బిహార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికుల మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకత్వంలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
నేటి విద్యార్థులు వివిధ రంగాల్లో కెరీర్ అవకాశాలపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, సైన్యం, రాజకీయాల వంటి ప్రజాసేవా రంగాలపై ఆసక్తి కనపరిచేవారి సంఖ్య తగ్గిపోతోందని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నెల్లూరులో చైన్ స్నాచర్లు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ముగ్గురు మహిళల మెడల్లో బంగారు గొలుసులను అపహరించడం తీవ్ర కలకలం రేపింది.
నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
నెల్లూరులోని చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు సమీపంలో ఈ రోజు (గురువారం) ఉదయం బస్సు ప్రమాదానికి గురైంది. కోల్కతా-చెన్నై హైవేపై టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది.
నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పడుగుపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఎక్స్కవేటర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో పాటు సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
నెల్లూరు రూరల్లో ‘నన్ను ప్రశ్నించండి’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతుడు కాదని.. ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.