గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వాస్పత్రిలో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు పూర్తికావడంతో 2వ ఏజేఎస్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. కొక్కిలిగడ్డ నుంచి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ప్రజాహితమే ప్రభుత్వ అభిమతమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజాదర్బారు’ నిర్వహించారు.
కృష్ణా జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం పెదప్రోలులో మంత్రికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
గాదె సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. స్వయంగా ఐజీ రంగంలోకి దిగి నేరుగా ప్రశ్నించినప్పటికీ, సీఐ నాగరాజు నోరు మెదపకపోవడం, సమాధానాలు చెప్పకుండా దాటవేయడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.
రాష్ట్రంలో పర్యాటక, రవాణా రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టూరిస్ట్ బస్సుల నిర్వహణ భారాన్ని తగ్గించేలా.. పన్నుల తగ్గింపునకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.