దేశవ్యాప్తంగా అమలవుతున్న మిషన్ కర్మయోగిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికత ఆధారిత శిక్షణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు మెరుగుపడుతోందని.. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రశంసించారు.
భారత దేశంలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్యులపై భారం పడుకుండా ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు.
వడ్డెర్ల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కూటమితోనే వడ్డెర్లకు ఆర్థిక, సామాజిక గుర్తింపు అని అన్నారు.
ఏపీ వ్యాప్తంగా ఆర్టీఎస్ఎస్ పనులు, పీఎం సూర్యఘర్ కనెక్షన్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి ఎస్ఐహెచ్ఎం సిబ్బంది వేతన కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. మంత్రి కందుల దుర్గేశ్ చొరవతో రూ.84 లక్షల బకాయిలు విడుదలయ్యాయి.
ఎల్పీజీ సిలెండర్లకు బదులుగా పైప్డ్ గ్యాస్ను వాడేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతరం సరఫరా అవుతుందన్నారు.
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు.
మార్చి 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.
మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు విడుదలయ్యాయి.