శ్వేత విప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆదర్శంగా నిలిచిందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలోని జంగిల్ రాజ్ నుంచి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం బయటపడేసి స్థిరత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. రాజ్ కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ఈరోజు సభలో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
సైబర్ నేరాల్లో తరచూ మ్యూల్ ఖాతాలను సమకూరుస్తున్న ముఠా చిక్కుతున్నా.. అసలు నేరస్తులు ఎందుకు తప్పించుకుంటున్నారు..? మ్యూల్ నిందితులు అరెస్టయిన కొద్దిసేపటికే వారి ఫోన్లలోని డేటా ఎలా డిలీట్ అవుతోంది..? అసలు సైబర్ సూత్రధారులు తప్పించుకోడానికి కారణమేంటి? అనే పోలీసుల ప్రశ్నకు పుష్బుల్ యాప్ సమాధానం చెప్పింది. అసలు ఈ యాప్ ఏంటి? దీనిద్వారా సైబర్ సూత్రధారులు ఎలా తప్పించుకుంటున్నారు?.. అంటే..
జిల్లాలో డ్రోన్ల వినియోగం పెరిగింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోనే అత్యధికంగా డ్రోన్లను వినియోగిస్తున్న టాప్ జిల్లాల జాబితాలో ఎన్టీఆర్ జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. నగరంలో డ్రోన్ సమ్మిట్ అనంతరం ప్రైవేట్ రంగాలతో సమానంగా ప్రభుత్వ శాఖలు కూడా డ్రోన్లను ఉపయోగిస్తుండటం, వ్యవసాయం, పోలీసు, జిల్లా యంత్రాంగాలు డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తుండటం, ఫొటోగ్రఫీలో కీలకంగా మారడంతో డ్రోన్లకు ప్రాధాన్యత ఏర్పడింది.
డీపీఆర్ సిద్ధమై టెండర్లను పిలవాల్సిన దశలో స్తబ్దుగా ఉన్న డబుల్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల (డీఎఫ్సీ)పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరడం, ఆయన సానుకూలంగా స్పందించడమే ఇందుకు కారణం.
ఈ ఏడాది 5 లక్షల మైక్రో ఎంటర్ప్రైజ్ల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గతేడాది ఒక లక్ష మైక్రో ఎంటర్ప్రైజ్ల లక్ష్యాన్ని సాధించినందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జవాబుపత్రాలు భద్రంగా ఉన్నాయా? లేదా? వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా? అనేది ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించాలని సూచించింది.