Home » Andhra Pradesh » Kadapa
పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వేదికగా నాటుకోడి మాంసం ధరల పెరుగుదలపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కడప కేంద్రంగా సాగుతున్న ఒక భారీ ట్రావెల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రల పేరుతో అమాయక పర్యాటకులను నమ్మించి, విదేశీ గడ్డపై వారిని గాలికొదిలేసిన ఈ ఘటన బాధితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 23వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది.
కడప జిల్లా గండికోట ఉత్సవాలు ఈ సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ఈ శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అప్పు చెల్లించాలంటూ తీసుకున్న వ్యక్తిని వేధింపులకు గురి చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి భార్యతోపాటు తండా వాసులు పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.
రప్పా.. రప్పా.., ‘గంగమ్మ జాతర’ అంటూ రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. విపక్షంలో ఉండగానే అరాచకం సృష్టిస్తున్నారు.
ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది.
సైబర్ నేరగాళ్లు యువకుల మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. అవతలి వ్యక్తి బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని తెలిస్తే చాలు.. వారికి వీడియోకాల్ ద్వారా ఫోన్చేసి ఆధార్కార్డు చూపించి మోసం చేస్తున్నారు.