Home » Andhra Pradesh » Guntur
రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగం గుంట్లలో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది.
అన్నదాత సుఖీభవ మొదటి దశ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 45.5 లక్షల మంది రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.12వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ పేదల గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
ఆక్వా ఫీడ్ ధర తగ్గించాలని తయారీదారులను సీఎం చంద్రబాబు నాయుడు కోరడంతో వారు సానుకూలంగా స్పందించారు. దీంతో ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిర్దేశించడంతో ఆక్వా ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో పొగాకు, మామిడి, ఆక్వా ధరలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణలోని 'కోడి చెరువు' భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బీచ్ షాక్స్’ పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవో నంబర్ - 362 ప్రకారం, ఎంపిక చేసిన బీచ్లలో పరిమిత నిబంధనలతో ఈ షాక్స్ ఏర్పాటు చేయనున్నారు.