Home » Andhra Pradesh » Guntur
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయి ప్రవర్తించారు. రోడ్డుపై పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.
మొంథా తుపాన్ వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్నికేంద్ర మంత్రి చౌహన్కు సీఎం చంద్రబాబు వివరించారు. ఇక మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సహకారించాలని ఆయనకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు.
గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులని ప్రారంభించారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. దేశానికి ఆయన చేసిన సేవలను చంద్రబాబు, లోకేష్ కొనియాడారు.
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.ఈ క్రమంలోనే మడ్డిని మాచవరం పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6వ తేదీన డాలస్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. యువనేత సభ కోసం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.
జనసేన పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఎక్స్ ఖాతాను రికవరీ చేసేందుకు జనసేన పార్టీలోని ఐటీ సిబ్బంది రంగంలోకి దిగారు.
ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న శంకర ఆస్పత్రికి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు.
మొంథా నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది. టీమ్-2లో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ కె.పోన్నుసామి, కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ, హైదరాబాద్ నుంచి శ్రీనివాసు బైరి, కేంద్ర విద్యుత్ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆర్తీ సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా ఉన్నారు.