Home » Andhra Pradesh » Guntur
శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవ చేశారని.. శెట్టిబలిజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని వెంకటరెడ్డిని ప్రశంసించారు.
అమరావతిలో 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచస్థాయి అసెంబ్లీని నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం, హడ్కో నుంచి నిధుల సమీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు.
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాకతో విశాఖ ప్రాంతం పరిశ్రమల హబ్గా మారుతోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 25వ తేదీతో ఇవి ముగియనున్నాయి. ఈ ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పశుసంవర్థక రంగానికి ఏపీ సర్కార్ భారీ ఊరట కల్పించింది. పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు నిచ్చింది. భవన అనుమతుల రుసుములో సడలింపులు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసును సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు.
ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడమే కాకుండా, పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, గృహ అవసరాలకు ఎక్కడా కొరత లేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు.