Home » Andhra Pradesh » Guntur
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై సీఎం స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ ఏలూరు జిల్లాలోని పెదపాడు పాఠశాలకు కొత్త భవనం నిర్మించారు. ‘అడవితల్లి బాట’ కార్యక్రమ ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన మాట మేరకు పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయించారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందింది. వివిధ విభాగాల్లో రాష్ట్రంలోని గ్రామాలు, సంస్థలు జాతీయ అవార్డులను సొంతం చేసుకుని రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం కీలక సమావేశం నిర్వహించింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
అగ్నిమాపక శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫైర్స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు.
ట్రాన్స్జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
రొయ్యల ఫీడ్ ధరలను కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలు దాదాపుగా పూర్తయ్యాయని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అధికారులు, మంత్రుల నివాస భవన నిర్మాణాలు తుది దశలో ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు పూర్తి చేసిన అనంతరం అస్సాం రాజధాని గౌహతికి సీఎం బయలుదేరారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల కంటే సేవకే అగ్ర ప్రాధాన్యం ఇస్తారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడానికి పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.