Home » Andhra Pradesh » Guntur
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సర్మించుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ప్రభుత్వ శకటాల ప్రదర్శన సందడి నెలకొంది. అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో శనివారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. అనంతరం వాటిని రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నారు.
జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. జాతీయ జెండా మన ఐక్యతకు చిహ్నం.. భవిష్యత్కు మార్గదర్శకమని తెలిపారు.
పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించిన శౌర్య, సేవా పతకాల్లో మన రాష్ట్రానికి 27 లభించాయి. దేశవ్యాప్తంగా పోలీసు, అగ్నిమాపక దళం, హోంగార్డు, పౌర రక్షణ, జైళ్ల శాఖలకు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్రం శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది.
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రాజధాని అమరావతి ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతమంతా వెలిగిపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయ భవనాలను ఎలక్ట్రిక్ లైట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అసైన్డ్ భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో వింత ఘటన జరిగింది. చేతబడి చేస్తారన్న భయంతో చోరీ చేసిన సొమ్మును దొంగలు.. తిరిగి యజమానికే అప్పగించడం సంచలనం రేపుతోంది.