Home » Andhra Pradesh » Guntur
ఆంధ్రప్రదేశ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ బదిలీకి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యువజన, అభ్యుదయ, పర్యాటక & సాంస్కృతిక శాఖ పరిధి నుంచి సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ శాఖకు అకాడమీని బదిలీ చేసింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది భారతదేశ నాగరికతా జీవన విధానంలో ఒక అంతర్భాగమని వ్యాఖ్యానించారు.
గాదె సాయికృష్ణ అదృశ్యం నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని లింగంగుట్లలో శనివారం విడుదల చేశారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల చేశారు.
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆర్కే చేసిన సేవలను గుర్తుచేస్తూ నేతలు ప్రశంసలు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరుదైన వ్యాధిగ్రస్థులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రత్యేక పాలసీ రూపొందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దూరదృష్టి, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్వాంటం, డీప్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి నుంచి మధ్యాహ్నం చిలకలూరిపేట మండలం లింగంగుంట్లకు ఆయన హెలికాఫ్టర్లో చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పేలుడు పదార్థాల కేసు నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడు షేక్ మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ అలియాస్ విజయకుమార్పై విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్షీట్ సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్లో ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 235వ బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించారు.