రాగి నిప్పట్టు.. తయారు చేసుకోండిలా...
ABN , Publish Date - Apr 12 , 2026 | 01:19 PM
రాగి పిండి - రెండు కప్పులు, వరి పిండి - పావు కప్పు, శనగ పప్పు- పావు కప్పు, ఇంగువ - స్పూను, నువ్వులు - స్పూను, వేయించిన పల్లీలు - పావు కప్పు, ఎండు మిర్చి-స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.
కావలసిన పదార్థాలు: రాగి పిండి - రెండు కప్పులు, వరి పిండి - పావు కప్పు, శనగ పప్పు- పావు కప్పు, ఇంగువ - స్పూను, నువ్వులు - స్పూను, వేయించిన పల్లీలు - పావు కప్పు, ఎండు మిర్చి-స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.
తయారుచేసే విధానం: శనగపప్పును అరగంట పాటు నీళ్లలో నాన బెట్టాలి. ఓ గిన్నెలో రాగి పిండి, వరి పిండి, పలుకులుగా చేసిన పల్లీలు, ఉప్పు, మిర్చి, నువ్వులు, ఇంగువ, నానబెట్టిన శనగపప్పు, కాస్త వేడి నూనెను చేర్చి కలపాలి. ఆ తరవాత వేడినీళ్లని కలిపి ముద్దలా చేసుకుని మూతపెట్టి పది నిమిషాలు పక్కనబెట్టాలి. ఆ తరవాత చేతులకి కాస్త నూనె రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి, తడిగుడ్డపై పూరీల్లా వత్తుకుని నూనెలో దోరగా వేయిస్తే రాగి నిప్పట్టు సిద్ధం.
ఈ వార్తలు కూడా చదవండి:
పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!
ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే ‘మావిగన్’: ఏబీవీ
Read Latest Telangana News and National News