Share News

వినాయక విగ్రహం కొనుగోలులో ఘర్షణ.. వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 14 , 2026 | 10:20 AM

వినాయక విగ్రహ కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వినాయక విగ్రహం కొనుగోలులో ఘర్షణ.. వ్యక్తి మృతి
Medchal Ganesh idol dispute

మేడ్చల్-మల్కాజిగిరి, సెప్టెంబర్ 14: వినాయక విగ్రహ కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జోడిమెట్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. చౌదరిగూడ ప్రాంతానికి చెందిన కొందరు వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు జోడిమెట్లకు వెళ్లారు. అక్కడ విగ్రహాలు విక్రయిస్తున్న వారితో ధర, కొనుగోలు విషయంలో మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో చౌదరిగూడకు చెందిన కిరణ్‌(34) అనే వ్యక్తిపై విక్రయదారుల్లో కొందరు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన కిరణ్‌‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందాడు.


ఈ ఘటనలో విగ్రహాలు విక్రయిస్తున్న రాజస్థాన్‌కు చెందిన చోగారామ్‌ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. కిరణ్‌ మృతితో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు.. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

కాణిపాకంలో చవితి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 10:34 AM