Home » Malkajgiri
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమపై వంద మంది కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో పులువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మల్కాజ్గిరిలో దారుణం జరిగింది. కన్న బిడ్డను తల్లి బిల్డింగ్పై నుంచి పడేసింది. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింనది.
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని అభివర్ణించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. దేశం సురక్షితంగానూ, సుభిక్షంగానూ ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఓ యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి, ఆమె ఆడియోను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్యపెళ్లి కొడుకు. జిమ్లో పరిచయమైన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.
సికింద్రాబాద్ స్టేషన్లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను బుధవారం నుంచి నవంబర్ 26 వరకు మల్కాజ్గిరి, హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్కు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిచిగా గంజాయి, మద్యం విక్రయిస్తున్నారని, యువత పెడధోరణి పడుతున్నారని.. ప్రొహిబిషన్ కాదు ప్రమోషన్ శాఖగా ఎక్సైజ్ శాఖ మారిందని ఎక్సైజ్ శాఖ దిశ కమిటీ చైర్మన్, ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
నాగర్కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్లను బాంబులతో పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్స్తో ఒక్కసారిగా కలకలం రేగింది. కరీంనగర్కు చెందిన మావోయిస్టు ముప్పాళ్ల లక్ష్మణ్రావు పేరిట కలెక్టర్లకు ఈ-మెయిల్స్ వచ్చాయి.