లోక్అదాలత్ కేసులపరిష్కారంలో హైదరాబాద్ ఫస్ట్
ABN , Publish Date - Sep 14 , 2026 | 07:15 AM
తెలంగాణలో నిర్వహించిన మూడో జాతీయ లోక్అదాలత్లో మొత్తం 1,51,164 కేసులకు పరిష్కారం లభించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మూడో తేదీ నుంచి శనివారం వరకు నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. కేసుల పరిష్కారంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా, ఖమ్మం జిల్లాకు రెండో ర్యాంకు దక్కింది. మొత్తం 1,51,164 కేసులకు పరిష్కారం లభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. న్యాయ, పోలీసు వ్వవస్థల సమన్వయంతో ఈ కేసుల పరిష్కారం సాధ్యమైనట్లు తెలంగాణ నేర పరిశోధన విభాగం డైరెక్టర్ జనరల్ చారు సిన్హా అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ను వీడేది లేదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News