శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:45 PM
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేదిక అకస్మాత్తుగా కుప్పకూలింది.
నల్లగొండ, మార్చి 27: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంకు(MLA Vemula Veeresham) తృటిలో ప్రమాదం తప్పింది. కేతేపల్లి మండలం బండపాలెంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేదిక అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని వెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. సీతారాముల కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇలాంటి సమయంలో వేదిక కూలడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ అపశృతి జరిగిందంటూ తీవ్రంగా విమర్శించారు.
ఇవి కూడా చదవండి...
సైబర్ నేరగాళ్ల వలలో మాజీ ప్రొఫెసర్.. కోటి స్వాహా
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న జెండా ఆవిష్కరణ
Read Latest Telangana News And Telugu News