సూర్యాపేటలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జి
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:43 AM
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వివాదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.
సూర్యాపేట, జులై 8: జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వివాదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఛలో గాంధీభవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి నేతలు పిలుపునిచ్చారు. దీంతో వారిని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు ఇరువర్గాలపై లాఠీఛార్జి చేశారు.
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఇటీవల ప్రకటించిన తొమ్మిది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను మార్చాలంటూ ఎమ్మెల్యే అసంతృప్తి వర్గం నేతలు ఈరోజు(బుధవారం) ఛలో గాంధీభవన్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో అర్వపల్లి చౌరస్తాకు వారి వాహనాలు చేరుకోగానే ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దాడుల్లో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ చెదరగొట్టినప్పటికీ మరోసారి రాళ్లు, కర్రలతో దాడులు చేసుకుంటూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. చివరకు పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులు
దివాలా రాష్ట్రమని ప్రచారం చేసే వారికి ప్రపంచబ్యాంకు నివేదికే సమాధానం: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News