స్నేహితుడి నంబర్తో మెసేజ్.. ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయం
ABN , Publish Date - Aug 15 , 2026 | 02:58 PM
జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నంబర్తో వచ్చిన ఓ మెసేజ్ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు నాలుగు లక్షల నగదు మాయమవడం సంచలనం సృష్టిస్తోంది.
జగిత్యాల, ఆగస్టు 15: జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నంబర్తో వచ్చిన ఓ మెసేజ్ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు నాలుగు లక్షల నగదు మాయమవడం సంచలనం సృష్టిస్తోంది. అశోక్ అనే వ్యక్తి వాట్సాప్నకు APK ఈ-చలాన్ మెసేజ్ వచ్చింది. స్నేహితుడి నంబర్ నుంచి రావడంతో ఆ లింక్ను ఓపెన్ చేశాడు అశోక్. ఆ వెంటనే అతడి బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. రెండుసార్లు దాదాపు రూ.4.15 లక్షలను కేటుగాళ్లు దోచేశారు. ఒకసారి రూ.3.99 లక్షలు, మరోసారి రూ.15వేల చొప్పున సైబర్ నేరగాళ్లు కాజేశారు.
లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఖాతా నుంచి డబ్బులు మాయమవడంతో బాధితుడు షాక్కు గురయ్యాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. APK లింకులు, అనుమానాస్పద మెసేజ్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
నెలాఖరులోగా మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Read Latest Telangana News And Telugu News