గంజాయి మత్తులో ఓ యువకుడు ఏకంగా పోలీసు వాహనాన్నే...
ABN , Publish Date - Sep 08 , 2026 | 09:46 AM
కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్రోల్ వాహనం చోరీ కలకలం రేపుతోంది. గంజాయి మత్తులో ఓ యువకుడు ఏకంగా పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. వెంటనే గుర్తించిన పోలీసులు వాహనం కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
కరీంనగర్, సెప్టెంబర్ 8: జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్రోల్ వాహనం చోరీ కలకలం రేపుతోంది. గంజాయి మత్తులో ఓ యువకుడు ఏకంగా పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. వెంటనే గుర్తించిన పోలీసులు వాహనం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అయితే గంజాయి మత్తులో ఉన్న యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎల్కతుర్తి దగ్గర అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఆపై పోలీస్ క్యాప్ పెట్టుకుని వాహనాలను ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఎల్కతుర్తి పోలీసులు అనుమనం వచ్చి కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు.
అప్పటికే వాహనం మిస్సింగ్పై కరీంనగర్లో పోలీసులు వెతుకుతున్నారు. అసలు విషయం తెలిసిన వెంటనే ఎల్కతుర్తి పోలీసులు.. వాహనంతో పాటు గంజాయి మత్తులో ఉన్న యువకుడిని ఎల్కతుర్తి నుంచి కరీంనగర్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
శాంసంగ్ కీలక నిర్ణయం.. భారత్లో లేఆఫ్స్
తిరుపతిలో మహిళపై దాడి.. మెడలో బంగారు గొలుసు చోరీ
Read Latest Telangana News And Telugu News