శాస్త్రిపురం ఆర్వోబీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Apr 17 , 2026 | 10:50 AM
శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ 71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సుమారు 490 మీటర్ల పొడవుతో, నాలుగు లైన్లలో ఫ్లైఓవర్ను నిర్మించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17: హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక అడుగుపడింది. నగరంలో మరో ఆర్వోబీ(ROB) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈరోజు(శుక్రవారం) శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ 71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సుమారు 490 మీటర్ల పొడవుతో, నాలుగు లైన్లలో ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ నిర్మించింది.

జీహెచ్ఎంసీ, సౌత్ సెంట్రల్ రైల్వేల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ను చేపట్టారు. శాస్త్రిపురం ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్ దేవ్పల్లి నుంచి ఫలక్నుమా మార్గంలో ప్రయాణం సులభతరం అయింది. ఉద్దమ్గడ్డ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ జామ్కు చెక్ పడనుంది. ప్రయాణ సమయం కూడా చాలా వరకు తగ్గనుంది. ఈ ఫ్లైఓవర్ ద్వారా మైలార్దేవ్పల్లి, వట్టెపల్లి, ఫలక్నుమా, ఆర్టీసీ బస్ డిపో ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడింది.
ఇవి కూడా చదవండి...
కూలర్ రిపేర్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
Read Latest Telangana News And Telugu News