జనసేన పార్టీ తెలంగాణ కార్యాలయం ప్రారంభించనున్న పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 18 , 2026 | 08:42 PM
హైదరాబాద్లో జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు మల్కం చెరువు సమీపంలోని పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.
హైదరాబాద్, జూన్ 18: నగరంలో జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు మల్కం చెరువు సమీపంలోని పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ నూతన కార్యాలయంతో తెలంగాణలో పార్టీ విస్తరణకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే రాష్ట్రంలోని జనసైనికులు, వీరమహిళలు, నాయకులకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి భారీగా జనసైనికులు తరలి వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన కార్యకలాపాలకు ఈ నూతన కార్యాలయం కేంద్రంగా మారనుందనే ప్రచారం సాగుతోంది. ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు తర్వాత.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, చేరికలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
మైనార్టీ సంక్షేమానికి భారీ కేటాయింపులు: డిప్యూటీ సీఎం మల్లు
ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు
Read Latest TG News And Telugu News