Share News

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. డాక్టర్‌‌ని అదుపులోకి తీసుకున్న సిట్

ABN , Publish Date - Mar 26 , 2026 | 10:16 AM

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా ఒక ప్రముఖ డాక్టర్‌ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. డాక్టర్‌‌ని అదుపులోకి తీసుకున్న సిట్
Moinabad drugs case

హైదరాబాద్, మార్చి 26: మొయినాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా జూబ్లీహిల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బాలాజీని అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టుతో డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న మరిన్ని పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.

ఫామ్‌హౌస్ కేంద్రంగా డ్రగ్స్ పార్టీలు

విచారణలో తేలిన వివరాల ప్రకారం, రోహిత్‌ రెడ్డి‌కి చెందిన ఫామ్‌హౌస్‌ను డ్రగ్స్ పార్టీల కోసం ఒక 'డెన్'గా వినియోగించినట్లు సిట్ గుర్తించింది. గతంలో పట్టుబడిన రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డిలను విచారించిన సమయంలో డాక్టర్ బాలాజీ పేరు బయటకు వచ్చింది. డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ నుంచి డాక్టర్ బాలాజీకి MDMA వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ అందినట్లు ఆధారాలు లభించాయి.


నిందితుల సంఖ్య 15కు చేరిక

ఈ కేసులో లోతైన విచారణ జరుగుతున్న కొద్దీ నిందితుల జాబితా పెరుగుతోంది. ఇప్పటివరకు 11 మందిగా ఉన్న నిందితుల సంఖ్య, తాజా అరెస్టులతో 15కు చేరింది. పెడ్లర్ రాకేష్ వర్మ, అభిషేక్, డాక్టర్ బాలాజీలతో పాటు మరో వ్యక్తిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు.

ముగ్గురి కోసం వేట

ప్రస్తుతం ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. డాక్టర్ బాలాజీకి డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా, అతను ఈ పార్టీల నిర్వహణలో ఏవైనా ఇతర బాధ్యతలు చేపట్టాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ కేసులో ఇరుక్కోవడంతో నగరంలో తీవ్ర కలకలం రేగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎం రేవంత్‌ కేరళ పర్యటన రద్దు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2026 | 10:39 AM