నేడు 13ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
ABN , Publish Date - Mar 21 , 2026 | 06:39 AM
నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య తిరిగే 13 ఎంఎంటీఎస్ రైళ్లను శనివారం రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య తిరిగే 13 ఎంఎంటీఎస్ రైళ్లను శనివారం రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) ప్రకటించింది. రద్దయిన వాటిలో ఫలక్నుమా-లింగంపల్లి మార్గంలో 5, మేడ్చల్-సికింద్రాబాద్(Medchal–Secunderabad) మధ్య 6, ఘట్కేసర్-సనత్నగర్ మధ్య తిరిగే రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి. మరోవైపు సికింద్రాబాద్-చిత్తాపూర్ మధ్య 2, సికింద్రాబాద్-వరంగల్(Secunderabad–Warangal) మధ్య 2 మెమూ రైళ్లను కూడా నిర్వహణ కారణాల రీత్యా రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణకే ఐఏఎస్ వాణిప్రసాద్: డీవోపీటీ ఉత్తర్వులు
Read Latest Telangana News and National News